యాప్నగరం

కేసీఆర్‌ ఆపద్ధర్మ సీఎం కాదు.. అధర్మ సీఎం: రావుల చంద్రశేఖర్

ప్రజల మధ్య తిరిగే సీఎం కావాలో, లేకపోతే ఫాంహౌస్‌‌లో విశ్రాంతి తీసుకునే వ్యక్తి సీఎం కావాలో ప్రజలు తమ ఓటు ద్వారా నిర్ణయిస్తారని పేర్కొన్నారు.

Samayam Telugu 25 Oct 2018, 4:51 pm
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కూటమిలో రాజకీయ వేడి మొదలైంది. ఓవైపు మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కిరాకున్నా, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మాత్రం వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ కీలకనేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదని.. అధర్మ ముఖ్యమంత్రి అంటూ ఎద్దేవా చేశారు. ప్రజల మధ్య తిరిగే సీఎం కావాలో, లేకపోతే ఫాంహౌస్‌‌లో విశ్రాంతి తీసుకునే వ్యక్తి సీఎం కావాలో తెలంగాణ ప్రజలు తమ ఓటు ద్వారా నిర్ణయిస్తారని పేర్కొన్నారు.
Samayam Telugu Ravula Chandra Sekar Reddy


ఓటమి భయంతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఇష్టారాజ్యంగా డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. పరస్పరం మద్దతిచ్చుకునే టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం పార్టీలు అప్రకటిత కూటమిగా సాగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రతి సమావేశంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును విమర్శించడం తగదన్నారు. గత నాలుగన్నరేళ్లలో ఏపీ సీఎం చంద్రబాబు.. ఎన్ని ప్రాజెక్టులు అడ్డుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌ పాలన వల్లే హైదరాబాద్‌లో మెట్రో నిర్మాణం మూడేళ్లు ఆలస్యమైందని ఆయన ఆరోపించారు.

కాగా, తెలంగాణ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఏర్ప మహకూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా తేలలేదు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి (టీజేఎస్) ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారన్న దానిపై ఆసక్తి కనబరుస్తున్నాయి. కానీ సీట్ల పంపిణీ అంశం ఎంతకీ తేలకపోవడంతో.. మహా కూటమి నుంచి కోదండరాం తప్పుకుంటారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర కమిటీ నేడు (గురువారం) భేటీ అనంతరం నిర్ణయం తీసుకోనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.