యాప్నగరం

పక్కా ప్లాన్.. కేసీఆర్ కాసేపట్లో హాస్పిటల్‌లో చేరతారు: మర్రి

సానుభూతి రూపంలో ఓట్లను రాబట్టడం కోసం కేసీఆర్ మరి కొద్దిసేపట్లో హాస్పిటల్‌లో చేరుతారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి జోస్యం చెప్పారు.

Samayam Telugu 6 Dec 2018, 10:52 am
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. పోలింగ్‌కు కొద్ది సమయమే మిగిలి ఉండటంతో ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో ప్రత్యర్థులపై వ్యూహాత్మకంగాా ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ప్రచారానికి బుధవారం సాయంత్రంతో గడువు ముగిసిన సంగతి తెలిసిందే. మరి కొద్ది గంటల్లో ప్రచారానికి బ్రేకులు పడతాయనగా.. కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu CBFF83D2-C3AC-4C3C-8B72-9F13308F7EDD


‘‘గజ్వేల్ చిట్టచివరి ర్యాలీ పూర్తికాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పృహ తప్పుతారు. వెంటనే ఆయన్ను యశోదా ఆసుపత్రికి తరలిస్తారు. దీంతో ప్రజల్లో ఆయనపై సానూభూతి పెల్లుబిక్కుతుంది. ఇదంతా టీఆర్ఎస్ ముందస్తు వ్యూహంలో భాగమే’’ అని తెలిపారు. దీనిపై తన వద్ద పక్కా సమాచారం ఉందని మర్రి చెప్పారు.

ఎన్నికల కోసం తెలంగాణ సమాయాత్తం అవుతోన్న సమయంలో.. మహాకూటమికే మొగ్గు ఉందని లగడపాటి సర్వే వివరాలను బహిర్గతం చేయడం, దాన్ని గులాబీ నేతలు ఖండించడం తెలిసిందే. చంద్రబాబు ఒత్తిడి మేరకే లగడపాటి తన సర్వే వివరాలను మార్చేశారని కేటీఆర్ ఆరోపించారు. కాగా, ఎన్నికల్లో ఓడితే కేటీఆర్ ప్రతిపక్షంలో కూర్చోరని, అమెరికా తిరిగి వెళ్తారంటూ ఓ ఫేక్ వాట్సప్ చాట్ వైరల్ అయ్యింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.