ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆందోళనలు, త్యాగాలతో సాధించుకున్న పార్టీని కుటుంబ పార్టీలకు అప్పగిస్తారా? కేవలం స్వార్థంతో తమ కుటుంబాల కోసం ఆలోచించే పార్టీల చేతికి తెలంగాణ భవిష్యత్తు ఇస్తారా అంటూ ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు.
‘‘తెలంగాణలోని మజ్లిస్ పార్టీ కుటుంబ పార్టీ కాదా? టీడీపీ పుట్టి తెలుగువారికి స్వాభిమానం కోసం. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నాడు ఎన్టీఆర్ స్థాపించారు. కానీ, నేడు స్వార్థం కోసం ఎవరైతే తెలుగువారిని అవమానించారో వారి ఒడిలోనే ఆ పార్టీని పెట్టేశారు. మజ్లిస్ లాగానే టీడీపీ కూడా కుటుంబ పార్టీయే. ఏ నిర్ణయమైన ఆ కుటుంబమే చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబ పార్టీయే. చివరికి టీడీఆర్ఎస్ పార్టీ కూడా కుటుంబ పార్టీయే. తెలంగాణలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న ఏకైక పార్టీ బీజేపీ’’ అని అన్నారు.
Read also: ఇక్కడికి వస్తే ఆయనే గుర్తొస్తారు.. మోదీ తెలుగు ప్రసంగం
మీరు తెలంగాణ ఎందుకు అడిగారు? తెలంగాణ కోసం యువత ఎందుకు త్యాగాలు చేశారు? అన్నేళ్లపాటు ఎందుకు పోరాడారు? తెలంగాణ ఇచ్చింది.. ఆ కుటుంబం లూటీ చేయడానికి కాదు. ప్రజల కోసం పుట్టిన తెలంగాణను కుటుంబ పార్టీల చేతుల్లో పెట్టొద్దు’’ అంటూ నాలుగు ప్రత్యర్థి పార్టీలపై మోదీ విమర్శలు గుప్పించారు. ‘‘ఇప్పటికే ఐదేళ్లు వృథా అయ్యాయి. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఓటు బ్యాంకు ఆటలాడితే అభివృద్ధి చెందదు. తెలంగాణ ప్రాజెక్టుల కోసం రూ.30 కోట్లు ఇచ్చాం. రూ.8 వేల కోట్లతో రైల్వే ప్రాజెక్టులు, రూ.10వేల కోట్లతో హైవే ప్రాజెక్టులు జరుగుతున్నాయి’’ అని అన్నారు.
Read also: ‘చంద్ర’ ద్వయంపై మోదీ Top 10 విసుర్లు!
‘‘తెలంగాణలోని మజ్లిస్ పార్టీ కుటుంబ పార్టీ కాదా? టీడీపీ పుట్టి తెలుగువారికి స్వాభిమానం కోసం. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నాడు ఎన్టీఆర్ స్థాపించారు. కానీ, నేడు స్వార్థం కోసం ఎవరైతే తెలుగువారిని అవమానించారో వారి ఒడిలోనే ఆ పార్టీని పెట్టేశారు. మజ్లిస్ లాగానే టీడీపీ కూడా కుటుంబ పార్టీయే. ఏ నిర్ణయమైన ఆ కుటుంబమే చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబ పార్టీయే. చివరికి టీడీఆర్ఎస్ పార్టీ కూడా కుటుంబ పార్టీయే. తెలంగాణలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న ఏకైక పార్టీ బీజేపీ’’ అని అన్నారు.
Read also: ఇక్కడికి వస్తే ఆయనే గుర్తొస్తారు.. మోదీ తెలుగు ప్రసంగం
మీరు తెలంగాణ ఎందుకు అడిగారు? తెలంగాణ కోసం యువత ఎందుకు త్యాగాలు చేశారు? అన్నేళ్లపాటు ఎందుకు పోరాడారు? తెలంగాణ ఇచ్చింది.. ఆ కుటుంబం లూటీ చేయడానికి కాదు. ప్రజల కోసం పుట్టిన తెలంగాణను కుటుంబ పార్టీల చేతుల్లో పెట్టొద్దు’’ అంటూ నాలుగు ప్రత్యర్థి పార్టీలపై మోదీ విమర్శలు గుప్పించారు. ‘‘ఇప్పటికే ఐదేళ్లు వృథా అయ్యాయి. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఓటు బ్యాంకు ఆటలాడితే అభివృద్ధి చెందదు. తెలంగాణ ప్రాజెక్టుల కోసం రూ.30 కోట్లు ఇచ్చాం. రూ.8 వేల కోట్లతో రైల్వే ప్రాజెక్టులు, రూ.10వేల కోట్లతో హైవే ప్రాజెక్టులు జరుగుతున్నాయి’’ అని అన్నారు.
Read also: ‘చంద్ర’ ద్వయంపై మోదీ Top 10 విసుర్లు!