యాప్నగరం

సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ధర్నా

ఎన్నికల సమయంలో ప్రజల్లో చైతన్యం కల్గించి, ఓట్ల కోసం వచ్చే నేతలను తమ సమస్యలపై నీలదీసేందుకు తెలంగాణ ప్రజా ఫ్రంట్ తమ వంతు ప్రయత్నం చేసింది.

Samayam Telugu 4 Dec 2018, 11:48 am
నవంబరు 1న తెలంగాణ‌ ప్రజా ఫ్రంట్ ప్రారంభించిన ప్రజా చైతన్య యాత్ర డిసెంబరు 5తో ముగియనుంది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజా సమస్యలపై రాజకీయ పార్టీలను నిలదీయాలనే సంకల్పంతో ఈ యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద మంగళవారం ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ ధర్నా నిర్వహిస్తున్నట్టు ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు నాలమాస కృష్ణ‌తెలిపారు. ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులను నిలదీయాలని, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగే ప్రజా అసెంబ్లీ కార్యక్రమన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Samayam Telugu darna


ఈ కార్యక్రమంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి, చుక్కా రామయ్య, ప్రొఫెసర్ పద్మజా షా, ప్రొఫెసర్ లక్ష్మణ్, హరగోపాల్, కే శ్రీనివాస్ లాంటి అనేక మంది మేధావులు ఇందులో పాల్గొంటున్నారని ఆయన తెలియజేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావాలని ఆయన కోరారు. దాదాపు నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ప్రజల సమస్యలపై చర్చించారు. ఎన్నికల సమయంలో ప్రజల్లో చైతన్యం కల్గించి, ఓట్ల కోసం వచ్చే నేతలను తమ సమస్యలపై నీలదీసేందుకు తమ వంతు ప్రయత్నం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.