యాప్నగరం

Ramana: కేసీఆర్‌ పిచ్చి కుక్కలా తయారయ్యాడు: రమణ

టీఆర్ఎస్ అధినేతపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ.

Samayam Telugu 27 Nov 2018, 4:33 pm
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం ‘మీట్ ద ప్రెస్’లో మాట్లాడిన ఆయన టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా ప్రజాకూటమి పనిచేస్తుందని, టీఆర్‌ఎస్‌ నాయకులను ప్రజలు సన్నాసులుగా భావిస్తున్నారని విమర్శించారు.
Samayam Telugu Untitled12


ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదని, రాష్ట్రంలో ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాచ్‌డాగ్‌లా ఉంటానని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌.. ఇప్పుడు పిచ్చి కుక్కలా తయారయ్యాడని రమణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ఆయన అధికారంలోకి వస్తే తన మనవడిని కూడా రాజకీయాల్లోకి దింపుతాడన్నారు. తన తప్పులు ఎక్కడ భయటపడతాయనే భయంతో కేసీఆర్.. మోదీతో కుమ్మక్కై తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నాడని తెలిపారు.

లక్షల మంది పోరాటంతో తెలంగాణ వచ్చిందని, కేసీఆర్‌ మాత్రం తానొక్కడినే తెలంగాణ తెచ్చినట్టుగా మాట్లాడుతారని రమణ అన్నారు. ఆచరణకు సాధ్యమయ్యే హామీలనే ఇస్తున్నామని, కూటమిలోని అన్ని పార్టీల మేనిఫెస్టోలకు విలువ ఇస్తూనే ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తున్నామని తెలిపారు. డిసెంబరు 4న పూర్తి మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో టీడీపీ లేకుండా చేయాలని కేసీఆర్‌ చేసిన కుట్రలన్నీ బెడిసి కొట్టాయని, లక్షలాది మంది టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.