యాప్నగరం

టీడీపీ సీట్లపై అభ్యంతరాల్లేవ్: రమణ

కేసీఆర్‌ కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందని, ప్రజలు ఆలోచించి ఓటేయాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు పిలుపునిచ్చారు.

Samayam Telugu 1 Nov 2018, 6:58 pm
మహాకూటమిలో టీడీపీకి కేటాయించిన 14 సీట్లపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. కాగా, మహాకూటమిలో ఇప్పటివరకూ కాంగ్రెస్, టీడీపీ సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చినా, కోదండరామ్ పార్టీ తెలంగాణ జన సమితి (టీజేఎస్), సీపీఐ పార్టీల సీట్లపై స్పష్టత రాలేదు. ఢిల్లీలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అనంతరం రమణ గురువారం మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu L Ramana


తాము అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీది ఎప్పటికీ ప్రజాపక్షమే అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దుర్మార్గమైన గడీల పాలన కొనసాగుతోందన్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ కుటుంబ పాలనను కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందని, ప్రజలు ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. కూటమిలో భాగంగా టీడీపీకి కాంగ్రెస్ కేటాయించిన 14 సీట్లపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని పేర్కొన్నారు. త్వరలో తమ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసి పేర్లు ప్రకటిస్తామన్నారు. సీట్ల సంఖ్యపై తామెప్పుడూ ఆలోచించలేదని, తమకు కేటాయించిన స్థానాల్లో విజయం సాధించడంపైనే దృష్టి సారించినట్లు రమణ వివరించారు.

కాగా, కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఈనెల 8 లేదా 9న ప్రకటించనున్నారు. మొత్తం 119 స్థానాలకుగానూ కాంగ్రెస్‌ 95 స్థానాల్లో, టీడీపీ 14 స్థానాల్లో పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. మిగతా 10 స్థానాల్లో టీజేఎస్, సీపీఐలు బరిలోకి దిగుతాయా.. లేక తక్కువ సీట్లు కేటాయించారని కూటమి నుంచి బయటకు వస్తారా అన్నదానిపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.