యాప్నగరం

100 సీట్లు అంటున్న కేసీఆర్‌కూ భయమే? : వీహెచ్

కూకట్‌పల్లిలో ఏపీకి చెందిన నేతలు టీడీపీ అభ్యర్థి కోసం డబ్బులు పంచుతున్నారని వి. హనుమంతరావు అనుమానాలు వ్యక్తం చేశారు.

Samayam Telugu 6 Dec 2018, 6:11 pm
తాము 100 సీట్లు గెలిచి భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తామని తరచుగా చెబుతున్న తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ ఓటమి భయం పట్టుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంపైకి 50 మంది పోలీసులను తనిఖీలకు పంపించడం సబబేనా అని కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. నగరంలో వీహెచ్ మీడియాతో మాట్లాడారు. 100 సీట్లు అని చెబుతున్నా కేసీఆర్‌కు తమ విజయంపై నమ్మకం లేదని, కేవలం ప్రతిపక్ష నేతలపైనే పోలీసులను దాడులకు ఉసిగొల్పడం అందుకు నిదర్శనమన్నారు.
Samayam Telugu V Hanumatha Rao


కూకట్‌పల్లిలో ఏపీకి చెందిన నేతలు టీడీపీ అభ్యర్థి కోసం డబ్బులు పంచుతున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపుడి ప్రభాకర్ రావు నివాసంలో దాడులు చేస్తుండగానే ఆయన ఇంటి వెనుక డబ్బు సంచులు దొరికిన విషయం తెలిసిందే. దీనిపై వీహెచ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అభ్యర్థికి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఇంటిపై, ప్రగతి భవన్‌పై దాడులు చేసేందుకు పోలీసులు సిద్ధమేనా ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు 104, 108 వాహనాలలో డబ్బులు తరలించి సరఫరా చేస్తున్నారని కాంగ్రెస్, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నా తెలంగాణ డీజీపీ పట్టించుకోవడం లేదన్నారు. అందరినీ ఒకేలా చూడకపోతే డీజీపీకి చెడ్డపేరు రావడం ఖాయమన్నారు వీహెచ్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.