యాప్నగరం

TRS జాబితా 21న.. నిజామాబాద్ బరిలో కవిత లేనట్లేనా?

లోక్ సభ బరిలో తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మార్చి 21న ప్రకటించనున్నట్లు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తెలిపారు. నిజామాబాద్ స్థానం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 19 Mar 2019, 9:03 pm
టీఆర్‌ఎస్ పార్టీ తరఫున లోక్ సభ బరిలో దిగే అభ్యర్థుల జాబితాను గురువారం (మార్చి 21) ప్రకటించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. నిజామాబాద్ లోక్ సభ స్థానంపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సాయంత్రం నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఘాటు విమర్శలు చేశారు.
Samayam Telugu list


మంత్రి పదవుల మాదిరిగానే టీఆర్‌ఎస్ అభ్యర్థుల విషయంలోనూ కేసీఆర్ ట్విస్టు ఇస్తారని అందరూ భావిస్తున్నారు. ఖమ్మం ఎంపీ స్థానం విషయంలో ఇలాంటి వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ మీటింగ్‌లో చేసిన వ్యాఖ్యలు ఉత్కంఠ పెంచుతున్నాయి.

‘మార్చి 21న ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తా.. అదే రోజు నిజామాబాద్ అభ్యర్థిని కూడా ప్రకటిస్తాం..’ అని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ కవిత పేరు ప్రస్తావించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కవితకు మరో స్థానం నుంచి టికెట్ ఇచ్చి.. నిజామాబాద్ నుంచి మరో అభ్యర్థిని బరిలోకి దింపుతారేమోనని ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే.. నిజామాబాద్ సమావేశంలో ఎంపీ కవిత అన్నీ తానై వ్యవహరించారని.. అలాంటిదేమీ ఉండకపోవచ్చని మరికొంత మంది అంటున్నారు.

Also Read: అయోధ్య రామ మందిరం అంశంపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.