యాప్నగరం

మజ్లీస్ కాళ్ల ముందు కేసీఆర్ మోకరిల్లుతున్నారు: అమిత్ షా

‘‘తెలంగాణలో ముక్కోణపు పోరు జరుగుతోంది.. కేసీఆర్ మజ్లిస్ పార్టీకి మోకరిల్లుతున్నారు’’ - అమిత్ షా

Samayam Telugu 2 Dec 2018, 5:07 pm
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామని తెలిపారు. కేసీఆర్ మజ్లీస్ పార్టీ కాళ్ల వద్ద తెలంగాణ స్వాభిమానాన్ని తాకట్టు పెట్టారని, ఆ పార్టీకి భయపడే విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా నారాయణ పేటలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
Samayam Telugu DtZ2rwcUcAUWEwS


రిజర్వేషన్ల పేరుతో ముస్లింలను కేసీఆర్ మోసం చేస్తున్నారని, మతపరమైన రిజర్వేషన్లు రాజ్యంగ విరుద్ధమని తెలిపారు. తెలంగాణలో ఎవరు ముఖ్యమంత్రైనా వాళ్లు తమ కాళ్ల వద్దే ఉండాలంటూ మజ్లిస్ పార్టీ నేతలు అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని అమిత్ షా అన్నారు. మ‌జ్లిస్ కాళ్ల ముందు కేసీఆర్ మోక‌రిల్లుతున్నార‌ని విరుచుకుప‌డ్డారు. అమరుల కుటుంబాలను ఆదుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామనే హామీని కూడా ఆయన నిలబెట్టుకోలేదని ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.