యాప్నగరం

KTR: సిరిసిల్లలో కేటీఆర్‌ విజయం.. భారీ మెజారిటీ

సిరిసిల్ల నుంచి కేటీఆర్ గెలుపొందడం ఇది మూడోసారి. కేసీఆర్‌పై మహేందర్ రెడ్డి ఓడిపోవడం ఇది రెండోసారి.

Samayam Telugu 11 Dec 2018, 3:53 pm
తెలంగాణ ఐటీ మంత్రి, కేసీఆర్ తనయుడు కె.తారక రామారావు సిరిసిల్ల నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి మహేందర్ రెడ్డిపై 88,886 ఓట్ల మెజారిటీతో కేటీఆర్ విజయం సాధించారు. సిరిసిల్ల నుంచి కేటీఆర్ గెలుపొందడం ఇది మూడోసారి. 2014 ఎన్నికల్లో సైతం కేటీఆర్ 53,004 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కొండూరి రవీందర్ రావుపై కేటీఆర్ విజయం సాధించారు. కాగా, కేటీఆర్‌పై ఓడిపోవడం మహేందర్ రెడ్డికి ఇది రెండోసారి.
Samayam Telugu KTR_Siricilla


2009లో తొలిసారి సిరిసిల్ల నుంచి అసెంబ్లీకి పోటీచేసిన కేటీఆర్.. మహేందర్ రెడ్డిపై 171 ఓట్ల తేడాతో గెలిచారు. టీఆర్ఎస్ సీటు ఇవ్వకపోవడంతో రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మహేందర్‌రెడ్డి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇదిలా ఉంటే, తాను సిరిసిల్ల విజయం సాధించినట్టు కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘నా నియోజకవర్గం సిరిసిల్ల ప్రజలు నాకు ఇచ్చిన ఆధిక్యం 88,886. నా కెరీర్‌లోనే ఇది అత్యధిక మెజారిటీ. నా శాయశక్తులా కష్టపడి ప్రజలకు సేవ చేస్తా’ అని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.