యాప్నగరం

టీఆర్ఎస్‌లో ఖైరతాబాద్ టికెట్ లొల్లి.. మన్నె గోవర్ధన్ అనుచరుల ధర్నా

టీఆర్‌ఎస్‌లో టిక్కెట్ లొల్లి.. ఖైరతాబాద్ సీటు మన్నె గోవర్దన్ రెడ్డికి ఇవ్వాలంటూ అనుచరులో ఆందోళన.. తెలంగాణ భవన్ ముందు ధర్నా..

Samayam Telugu 12 Nov 2018, 3:44 pm
తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో.. పార్టీల్లో హడావిడి మొదలయ్యింది. బీ ఫారం దక్కించుకున్న అభ్యర్థులు నామినేషన్లకు సిద్ధమవుతుంటే.. అసంతృప్తుల బెడద పార్టీలను వెంటాడుతోంది. నిన్నటి వరకు కాంగ్రెస్, టీడీపీలను వెంటాడిన ఈ టిక్కెట్ లొల్లి.. టీఆర్ఎస్‌లోనూ మొదలయ్యింది. ఖైరతాబాద్ సీటుపై ఆ పార్టీలో దుమారం రేగింది. ఈ టికెట్ మన్నె గోవర్ధన్ రెడ్డికే కేటాయించాలంటూ అనుచరులు ఆందోళనకు దిగారు.
Samayam Telugu trs

సోమవారం మధ్యాహ్నం మన్నె అనుచరులు, టీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ ముందు ధర్నాకు దిగారు. మన్నెకు టికెట్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. తెలంగాణ భవన్ ముందు బైఠాయించడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. వారికి సర్ధిచెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.