యాప్నగరం

Khammam: ఖమ్మంలో మమ్మల్ని మేమే చంపుకున్నాం.. కేసీఆర్ అసంతృప్తి

రాష్ట్రవ్యాప్తంగా విజయ దుందుభి మోగించినప్పటికీ.. ఖమ్మం జిల్లాలో మాత్రం ఒక్క సీటే గెలవడం పట్ల కేసీఆర్ హర్టయ్యారు.

Samayam Telugu 11 Dec 2018, 5:52 pm
తెలంగాణ ఎన్నికల విజయాన్ని ప్రజలు సాధించిన విజయంగా కేసీఆర్ అభివర్ణించారు. ‘సకల జనులు నిండుగా దీవించి ఇచ్చిన విజయం ఇది. నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలు సాధించిన విజయం. వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అని కేసీఆర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ తమ పార్టీ స్వీయ తప్పిదాల కారణంగానే 15-16 చోట్ల ఓడిందన్నారు.
Samayam Telugu kcr3


ఖమ్మం జిల్లాలో తమ పార్టీ ఇలాగే ఓడిందని కేసీఆర్ తెలిపారు. ఖమ్మంలో మమ్మల్ని ఎవరూ ఓడించలేదు. మమ్మల్ని మేమే చంపుకున్నామంటూ గులాబీ బాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో ఒక్క స్థానంలో మాత్రమే గెలిచిన టీఆర్ఎస్.. ఈ దఫా కూడా ఒక్క సీటే గెలుపొందింది. మిగతా 9 స్థానాల్లో 8 చోట్ల మహాకూటమి విజయం సాధించింది. వైరాలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి గెలుపొందాడు.

చదవండి: కేసీఆర్‌‌కు మళ్లీ షాకిచ్చిన ఖమ్మం జిల్లా.. మహాకూటమిదే గెలుపు!

ఆశ్చర్యకరంగా పాలేరు నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఓడిపోయారు. తనకు సన్నిహితుడైన తుమ్మల ఓడటం కేసీఆర్‌ను కలచి వేసిందని ఆయన మాటలను బట్టి అర్థమైంది. సత్తుపల్లిలో పిడమర్తి రవి బాధ్యతలను తుమ్మలకు అప్పగించగా.. ఆయన కూడా ఓటమిపాలయ్యారు. మొత్తానికి ఖమ్మం జిల్లా ఫలితాల పట్ల కేసీఆర్ ఎంత అసంతృప్తిగా ఉన్నారో ఆయన మాటలను బట్టే అర్థం చేసుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.