యాప్నగరం

మా మద్దతు టీఆర్ఎస్‌కే.. కేసీఆర్ మళ్లీ సీఎం: అసద్

తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఆశీర్వదించారు. ఎవరి మద్దతు లేకుండా టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. అయినా ఎంఐఎం కేసీఆర్‌ వెంటే ఉంటుంది.

Samayam Telugu 10 Dec 2018, 6:08 pm
తెలంగాణలో ఎగిరేది టీఆర్ఎస్ జెండానే అంటున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్. కేసీఆర్ మరోసారి సీఎం కావడం ఖాయమన్నారు. కేసీఆర్‌తో భేటీ తర్వాత అసద్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాజకీయాలు, ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ప్రజలు మరోసారి కేసీఆర్‌ను ఆశీర్వదించారని.. ఎన్నికల తీర్పు కూడా కేసీఆర్‌కు అనుకూలంగా వస్తుందన్నారు. ఎవరి మద్దతు లేకుండానే టీఆర్ఎస్ అధికారంలోకి రాబోతోందని.. పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటుకాబోతుందన్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని కుండ బద్దలుకొట్టారు.
Samayam Telugu Asad


టీఆర్ఎస్‌కు ఎవరి మద్దతు అవసరం లేకపోయినా.. తాము మాత్రం కేసీఆర్ వెంటే ఉంటామన్నారు అసదుద్దీన్. ఎంఐఎం సీట్లు కచ్చితంగా సాధిస్తుందిని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ బలమేంటో ఫలితాలతో తేలిపోతుందన్నారు. మంగళవారం మరోసారి కేసీఆర్‌ను కలవబోతున్నట్లు చెప్పారు. అంతక ముందు అసదుద్దీన్‌ ఒవైసీ తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం అసదుద్దీన్ ఓ సామాన్యుడిలా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ప్రగతిభవన్‌కు బైకుపై వెళ్లారు. దాదాపు 4 గంటలకుపైగా ఈ సమావేశం కొనసాగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.