యాప్నగరం

లగడపాటిపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

లగడపాటి రాజగోపాల్‌పై చర్యలు తీసుకోండి.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ నేతలు..

Samayam Telugu 1 Dec 2018, 2:36 pm
మాజీ ఎంపీ లగడపాటిపై టీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తెలంగాణలో జరగబోయే ఎన్నికలను ప్రభావితం చేసేలా లగడపాటి సర్వేల పేరుతో ప్రకటన చేస్తున్నారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేత దండె విఠల్ లేఖ రాశారు. సర్వే వివరాలు బయటకు చెప్పడం, ఇలాంటి ప్రకటనలు చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని లేఖలో ప్రస్తావించారు. రోజుకు ఇద్ద‌రి అభ్య‌ర్థుల గెలుపు ఓటమిల గురించి చెబుతానన్న లగడపాటి వ్యాఖ్యల్నిపొందుపరిచారు.
Samayam Telugu pic


ఇలా సర్వేల పేరుతో ఉద్దేశపూర్వకంగానే లగడపాటి ప్రకటనలు చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. పార్టీలు, అభ్యర్థుల మనో స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌లో నేతగా ఉన్న రాజగోపాల్ ఆ పార్టీ నేతలకు ఎన్నికల్లో ప్రయోజనం కలిగేలా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇలాంటి ప్రకటనలు కూడా ఓటర్లను ప్రభావితం చేసినట్లేనన్నారు. దీనికి సంబంధించని వీడియోను కూడా ఈసీకి సమర్పించారు. ఇలాంటి సర్వేలను టీవీల్లో ప్రసారం చేయకుండా చూడాలని కోరారు.

శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లగడపాటి తెలంగాణ ఎన్నికలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కొందరు స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని జోస్యం చెప్పారు. రాష్ట్రం మొత్తం మీద 8 నుంచి 10 మంది వరకు ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధిస్తారన్నారు. ఇద్దరు అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించారు. రోజుకు ఇద్దరు చొప్పున గెలిచే స్వతంత్ర అభ్యర్థుల పేర్లు చెబుతానన్నారు. అందుకే టీఆర్ఎస్ లగడపాటిపై ఈసీకి ఫిర్యాదు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.