యాప్నగరం

TRS Suhasini trailing behind TRS: కూకట్‌పల్లిలో సుహాసిని వెనుకంజ, కారు జోరు

దేశవ్యాప్తంగా ఉత్కంఠతో ఎదురుచూసిన తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు చూపిస్తుంది. స్పష్టమైన మెజారిటీ దిశగా కారు దూసుకుపోతుంది.

Samayam Telugu 11 Dec 2018, 11:49 am
తెలంగాణలో కారు జోరు చూపిస్తుంది. స్పష్టమైన మెజారిటీ దిశగా కారు దూసుకుపోతుంది. 119 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 80 స్థానాల్లో ముందజలో ఉండగా.. కాంగ్రెస్ 15 స్థానాల్లో ముందంజలో ఉంది. టీఆర్ఎస్ ముఖ్య నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు దూసుకుపోతుండగా.. అందరూ ఆసక్తిగా గమనించిన కూకట్ పల్లిలో కూటమి అభ్యర్ధి సుహాసిని (టీడీపీ) వెనుకబడ్డారు. అక్కడ తెరాస అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Samayam Telugu Suhasini Nandamuri


Also Read: సైకిల్ ముందు చక్రం ఊడింది.. కసితో ఆంధ్రా ఓటర్లు వెయిటింగ్

వెనుకబడ్డ మరికొంత మంది కూటమి అభ్యర్దులు..
కూటమికి చెందిన కాంగ్రెస్‌ ముఖ్యనేతలు జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ తదితరులు తెరాస అభ్యర్థులపై వెనుకంజలో ఉన్నారు. నాగార్జునసాగర్‌లో జానారెడ్డిపై నోముల నర్సింహయ్య, కొడంగల్‌లో రేవంత్‌పై పట్నం నరేందర్‌ రెడ్డి, అందోల్‌లో దామోదర రాజనర్సింహపై చంటి క్రాంతికిరణ్‌, మధిరలో భట్టి విక్రమార్కపై లింగాల కమల్‌రాజ్‌ ఆధిక్యంలో ఉన్నారు.

లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.