యాప్నగరం

తాటి వెంకటేశ్వర్లుపై చెప్పులు విసిరిన గిరిజనులు

ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మాగంటి గోపీనాథ్‌, రేఖా నాయక్‌, జానారెడ్డి సహా పదుల సంఖ్యలో నియోజకవర్గాల్లో నేతలను ఓటర్లు అడ్డుకుని తమ సమస్యలపై నిలదీసిన విషయం విదితమే.

Samayam Telugu 23 Nov 2018, 3:33 pm
అసెంబ్లీ ఎన్నికలు రావడంతో నాయకులకు చేదు అనుభవాల పరంపర కొనసాగుతోంది. గత ఎన్నికల తర్వాత ఇప్పుడే కనిపించారని కొన్ని గ్రామాల్లో, మీరు మళ్లీ ఓట్ల సమయంలోనే వస్తారంటూ పార్టీలతో సంబంధం లేకుండా అభ్యర్థులను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుకు శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది.
Samayam Telugu Thati Venkateswarlu


అశ్వారావుపేట బరిలో దిగిన తాటి వెంకటేశ్వర్లు నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లగా బంజారా గిరిజనులు ఆయన ప్రచారాన్ని అడ్డుకున్నారు. చెప్పులతో నిరసన తెలిపారు. అంతటితో ఆగని గిరిజనులు తాటి వెంకటేశ్వర్లుపై చెప్పులు సైతం విసిరేయడం కలకలం రేపింది. గిరిజనులను అడ్డుకోవాలని చూసిన పోలీసులపై సైతం వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ గుర్తుపై నెగ్గిన తాటి వెంకటేశ్వర్లు అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే.
కేసీఆర్‌ అసెంబ్లీ రద్దు చేసిన సెప్టెంబర్‌ 6న 105 మంది అభ్యర్థులను ప్రకటించగా, ఆ మరుసటి రోజునుంచే టీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మాగంటి గోపీనాథ్‌, రేఖా నాయక్‌, జానారెడ్డి సహా పదుల సంఖ్యలో నియోజకవర్గాల్లో నేతలను ఓటర్లు అడ్డుకుని తమ సమస్యలపై నిలదీసిన విషయం విదితమే. నామినేషన్ల పర్వం ముగియడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచార జోరు పెంచాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.