యాప్నగరం

నెలాఖరులోగా కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు: రజత్‌కుమార్‌

రాష్ట్రంలో 7,45,838 మంది కొత్త ఓటర్లు, 243 మంది ప్రవాసులు ఓటర్లుగా నమోదయ్యారని రజత్‌కుమార్‌ తెలిపారు.

Samayam Telugu 20 Nov 2018, 7:42 pm
నవంబర్‌ 23వ తేదీ నుంచి డిసెంబర్‌ 1వరకు ఓటర్ స్లిప్‌ల పంపిణి జరుగుతుందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 23న బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ చేపడతాం అన్నారు. రాష్ట్రం నుంచి 35 వేల మంది పోలీసులు ఉండగా, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల నుంచి అదనంగా 18,000 పోలీసులను లోన్‌ తీసుకున్నట్లు వివరించారు.
Samayam Telugu Rajath Kumar


రాష్ట్రంలో మొత్తం 32,796 పోలింగ్‌ కేంద్రాలున్నాయని, ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు అక్రమంగా వివిధ మార్గాల్లో వచ్చిన రూ.90.72 కోట్లు సీజ్ చేశామని సీఈవో చెప్పారు. ఇటీవల సంగారెడ్డి కలెక్టర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించామని, అవన్నీ అవాస్తవాలేనని ఈసీకి నివేదిక పంపామని చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు చాలా వరకు తగ‍్గాయన్నారు.

రాష్ట్రంలో 7,45,838 మంది కొత్త ఓటర్లు, 243 మంది ప్రవాసులు ఓటర్లుగా నమోదయ్యారని తెలిపారు. నోటిఫికేషన్‌ ప్రకారంగానే డిసెంబర్‌ 7న పోలింగ్‌ జరుగుతుందని, 11న ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. నెలాఖరు వరకు కొత్త ఓటర్లందరికీ గుర్తింపు కార్డులు అందిస్తామని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.