యాప్నగరం

కేసీఆర్ పథకాలే టీఆర్ఎస్‌ను గెలిపిస్తాయి: జనార్దన్ రెడ్డి

గత నాలుగేళ్ల పాలనలో టీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమ పార్టీకి విజయాన్ని అందిస్తాయని మర్రి జనార్దన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Samayam Telugu 2 Dec 2018, 3:10 pm
తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా కేసీఆర్ ఆదివారం (డిసెంబరు 2న) పలు సభల్లో ప్రసంగించనున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభతో కేసీఆర్‌ ప్రచారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నాగర్‌కర్నూల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ పథకాలే టీఆర్‌ఎస్‌కు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.
Samayam Telugu Marri Janardhan Reddy


గత నాలుగేళ్ల పాలనలో టీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమ పార్టీకి విజయాన్ని అందిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గత 60 ఏళ్లలో లేని విధంగా 24 గంటల కరెంట్‌ ఇచ్చిన ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ అన్నారు. కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కల కేసీఆర్‌ హయాంలో సాకారమైందన్నారు. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదని, కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు బంధు పథకం తీసుకొచ్చి వారి కష్టాలు తీర్చారని కొనియాడారు. రైతుకు భరోసా కల్పించిన కేసీఆర్‌ మరోసారి అధికారంలోకి వస్తారని, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని మర్రి జనార్దన్‌రెడ్డి ఆకాంక్షించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.