యాప్నగరం

ఏపీ డీజీపీని నివేదిక కోరాం: రజత్‌కుమార్‌

ఇప్పటివరకూ 31కోట్ల మేర నగదుతో పాటు లైసెన్స్ కలిగిన 741 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని తెలంగాణ సీఈవో రజత్‌కుమార్ చెప్పారు.

Samayam Telugu 27 Oct 2018, 9:17 pm
తెలంగాణ ఓటర్ల జాబితా ముద్రణ అక్టోబర్ 19 నాటికి పూర్తి చేశామని, కొత్త జాబితాను నవంబర్ 19న విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ వెల్లడించారు. నిర్ణీత షెడ్యూలు ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణలో ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాలు సర్వేలు చేయడం, నగదు పంపిణీ చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు ఇతర పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.
Samayam Telugu Rajat Kumar


ఏపీ ఇంటెలిజెన్స్ నిజంగానే తెలంగాణకు వచ్చిందా లేదా చెప్పాలని, వస్తే అందుకు సంబంధించిన నివేదికను అందించాలని ఏపీ డీజీపీని కోరినట్లు తెలిపారు. డీజీపీ నుంచి నివేదిక అందాక తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇప్పటివరకూ ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై తమకు 59 ఫిర్యాదులు అందాయని రజత్‌కుమార్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే రాష్ట్ర ఓటర్ల జాబితాను విడుదల చేశామన్నారు.

ఓటర్ల నమోదుకు కొనసాగుతున్న దరఖాస్తులు
ఓటర్ల నమోదు కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఓట్లేయడానికి వచ్చే దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్న రజత్‌కుమార్.. మద్యం, డబ్బు పంపిణీ లాంటి వాటిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకూ 31కోట్ల మేర నగదుతో పాటు లైసెన్స్ కలిగిన 741 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మంత్రుల పీఆర్వోలు రాజకీయ అంశాలపై ప్రచారం చేస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇప్పటికే 43వేల మందిని బైండోవర్‌ చేశామని, 8,622 మందిపై ముందస్తు కేసులు నమోదుచేశామని సీఈవో రజత్‌కుమార్‌ వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.