తెలంగాణలో సుడిగాలి పర్యటనని భైంసా సభతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రారంభించారు. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆదిలాబాద్ జిల్లా భైంసాకి చేరుకున్న రాహుల్ గాంధీ.. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో సభా వేదికపైకి చేరుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆయనకి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
ఈ సభ ముగిశాక కామారెడ్డి వెళ్తారు. మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల మధ్య కామారెడ్డి సభలో పాల్గొంటారు. తర్వాత హెలికాఫ్టర్లో హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రం 5-6 గంటల మధ్య చార్మినార్ సభలో ప్రసంగిస్తారు. రాత్రి బేగంపేట్ నుంచి ప్రత్యేక విమానంలో రాహుల్ ఢిల్లీ బయల్దేరి వెళ్తారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రచారం చేసుకున్నప్పటికీ గత ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ పార్టీ.. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది. అందుకోసం రాహుల్ గాంధీతో సభలు నిర్వహిస్తోంది.
ఈ సభ ముగిశాక కామారెడ్డి వెళ్తారు. మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల మధ్య కామారెడ్డి సభలో పాల్గొంటారు. తర్వాత హెలికాఫ్టర్లో హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రం 5-6 గంటల మధ్య చార్మినార్ సభలో ప్రసంగిస్తారు. రాత్రి బేగంపేట్ నుంచి ప్రత్యేక విమానంలో రాహుల్ ఢిల్లీ బయల్దేరి వెళ్తారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రచారం చేసుకున్నప్పటికీ గత ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ పార్టీ.. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది. అందుకోసం రాహుల్ గాంధీతో సభలు నిర్వహిస్తోంది.