యాప్నగరం

వాళ్లను మోకాళ్లపై నిల్చోబెడతాం.. బెంగాల్‌లో యూపీ సీఎం యోగి షాకింగ్ కామెంట్స్

పశ్చిమ బెంగాల్‌లో కాషాయదళం ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బెంగాల్‌లో పర్యటించారు. మమత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 4 Apr 2021, 5:52 pm
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌ పరిస్థితులను యోగి కశ్మీర్ గత పరిస్థితులతో పోల్చారు. బెంగాల్‌లో ఉన్న పోకిరీతనం గతంలో కశ్మీర్‌లో ఎక్కువగా ఉండేదని.. ఇప్పుడు కశ్మీర్‌లో అలా లేదని ఆయన అన్నారు. కశ్మీర్‌లో కేవలం అభివృద్ధి మాత్రమే ఉందని యోగి వ్యాఖ్యానించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
yogi


పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రౌడీయిజంపై ఉక్కుపాదం మోపుతామని సీఎం యోగి అన్నారు. యూపీ తరహాలోనే గూండాలను అణచివేస్తామన్నారు. యూపీలో గూండాలకు ఏ గతి పట్టిందో.. బెంగాల్‌లో గూండాలకు కూడా అదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు. టీఎంసీ గూండాలను మోకాళ్లపై నిల్చోబెడతామని యోగి తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈసారి ఎలాగైనా బెంగాల్‌లో బీజేపీ జెండా ఎగరేయాలని కాషాయదళం తీవ్రంగా శ్రమిస్తోంది.

అదే రీతిలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ తిప్పికొడుతోంది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ హిందూ ముస్లిం విభజన రాజకీయాలు చేస్తోందని మమతా మండిపడుతున్నారు. బెంగాల్ బయటి నుంచి వచ్చిన గూండాలను తరిమేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్, శాంతిభద్రతల సమస్యలను సృష్టిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.