యాప్నగరం

బెంగాల్‌లో బాంబు పేలుళ్లు.! అలాంటిదేమీ లేదన్న ఈసీ

పశ్చిమ బెంగాల్ చివరి దశ ఎన్నికల వేళ గందరగోళం నెలకొంది. కోల్‌కతా నగర నడిబొడ్డున బాంబులు పేలడంతో ఓటర్లు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై ఈసీ అధికారి షాకింగ్ రిప్లై ఇచ్చారు.

Samayam Telugu 29 Apr 2021, 7:56 pm
పశ్చిమ బెంగాల్ చివరి దశ ఎన్నికల వేళ బాంబు పేలుళ్లతో భయాందోళన నెలకొంది. కోల్‌కతా నగర నడిబొడ్డున సెంట్రల్ ఎవెన్యూ ప్రాంతంలో పేలుళ్లు చోటుచేసుకోవడం ఓటర్లను షాక్‌కి గురిచేసింది. మహాజతి సదన్ బయట పేలుళ్లు జరిగాయని తెలియడంతో ఓటర్లు పోలింగ్ బూత్‌ నుంచి పరుగులు తీశారు. నాటుబాంబులు విసిరినట్లు ఆరోపణలు వచ్చాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
blast


అయితే అదంతా నిజం కాదని చీప్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారి వివరణ ఇచ్చారు. కొందరు వ్యక్తులు బాణసంచా కాల్చినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన స్పష్టం చేశారు. బాంబులు పేలాయని భావించి ఓటర్లు భయాందోళనకు గురయ్యారని అన్నారు. నిందితులను పట్టుకునేందుకు ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

ఇదిలా ఉంటే.. బీజేపీ జొరాసంకో నియోజకవర్గ అభ్యర్థి మీనా దేవి పురోహిత్ సంచలన ఆరోపణలు చేశారు. పోలింగ్ బూత్‌ల సందర్శనకు వెళ్తున్న సమయంలో తన వాహనంపై దుండగులు నాటుబాంబులు విసిరారని ఆమె ఆరోపించారు. బాంబులకు తాను భయపడలేదన్నారు. తనను చంపేందుకు కుట్ర పన్నారని.. ఓటర్లను భయపెట్టేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపించారు. కోల్‌కతాలోని ఏడు నియోజకవర్గాల్లో ఈ రోజు చివరి దశలో ఎన్నికలు జరిగాయి.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.