యాప్నగరం

‘బెంగాల్ ఆడపులికి శుభాకాంక్షలు.. దీదీ ఓ దీదీ’’ మోదీకి సంజయ్ అదిరిపోయే పంచ్

West Bengal Elections 2021 పశ్చిమ్ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ అఖండ విజయం సాధించింది. మమతకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Samayam Telugu 2 May 2021, 3:15 pm
పశ్చిమ్ బెంగాల్‌ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం దిశగా మమతా బెనర్జీ దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల సరళి ప్రకారం మూడింట రెండొంతుల మెజార్టీ సీట్లను టీఎంసీ కైవసం చేసుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటి బీజేపీకి చెందిన అతిరథ మహారథులంతా బెంగాల్‌లో ముమ్మరం ప్రచారం నిర్వహించారు. మమతపై బీజేపీ అధిష్ఠానం ముప్పేట దాడిచేసినా వారి ప్రయత్నాలను అభిమన్యుడిలా ఒంటిరిగానే ఎదుర్కొని.. ఎన్నికల పద్మవ్యూహాన్ని చేధించారు.
Samayam Telugu దీదీ.. మోదీ
PM Modi


అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే బెంగాల్‌ ‘దండయాత్ర’ను చేసింది బీజేపీ. అయినా సరే సీఎం మమతా బెనర్జీ ఎక్కడా తొణకలేదు. తెర వెనుక వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఉన్నప్పటికీ తెర ముందు మాత్రం మమతా బెనర్జీయే ఒంటరి పోరాటం చేసి పార్టీని విజయతీరాలకు చేర్చారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీకి పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, శివసేన నేత సంజయ్ రౌత్ తదితరుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.


‘‘అభినందనలు మమతా దీదీ... బెంగాల్ లో ప్రభంజనం సృష్టిస్తున్నారు.. నిజంగా ఏమి పోరాటం!’’ అని కేజ్రీ వ్యాఖ్యానించారు. దీదీ గెలుపుపై ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ స్పందిస్తూ.. అభినందనలు తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం మనం చేసే కృషి కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.
ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీని ప్రధాని నరేంద్ర మోదీ.. ‘దీదీ ఓ దీదీ’ అంటూ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన శివసేన ఫైర్ బ్రాండ్ సంజయ్ రౌత్.. ‘‘బెంగాల్ ఆడపులికి అభినందనలు.. దీదీ ఓ దీదీ’’ అంటూ ప్రధాని మోదీని ట్యాగ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.