యాప్నగరం

west Bengal Elections: హింసాత్మకం.. అయినా భారీగా పోలింగ్

నాలుగో దశ ఎన్నికలు హింసాత్మకంగా సాగాయి. కూచ్ బెహర్ జిల్లాలో పోలీసు సిబ్బందిపై మూకుమ్మడి దాడి చేయడంతో కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడు క్యూలో ఉండగా కాల్చి చంపారు.

Samayam Telugu 10 Apr 2021, 9:56 pm
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నాలుగో విడత ముగిసింది. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ భారీగా పోలింగ్ నమోదైంది. ఐదు జిల్లాల్లోని 44 నియోజకవర్గాల్లో నాలుగో దశ పోలింగ్ జరిగింది. సాయంత్రం ఐదు గంటల సమయానికి 76.16 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. హింసాత్మక ఘటన జరిగిన కూచ్ బెహర్ జిల్లాలోనే అత్యధికంగా పోలింగ్ జరగడం విశేషం. అక్కడ 79.73 శాతం ఓటింగ్ నమోదైంది. హుగ్లీలో 76.2 శాతం, సౌత్ 24 పరగణాల జిల్లాలో 75.49 శాతం, హౌరాలో 75.03 శాతం పోలింగ్ జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
polling


ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 15,940 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. హౌరా జిల్లాలో 9 నియోజకవర్గాలు, సౌత్ 24 పరగణాల జిల్లాలో 11, అలిపుర్దార్‌‌లో 5, హుగ్లీ జిల్లాలో 10, కూచ్ బెహర్‌లో 9 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరిగిన మొదటి దశ ఎన్నికల్లో 84.13 శాతం, రెండో దశలో 86, మూడో దశలో 84 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారి వెల్లడించారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.