యాప్నగరం

సీఎం మమతకు ఈసీ షాక్.. స్ట్రాంగ్ రిప్లై

సీఎం మమతా బెనర్జీకి చుక్కెదురైంది. ఆమె రాసిన లేఖకు ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది. ట్యాంపరింగ్ ఆరోపణలను కొట్టిపారేయడంతో పాటు ఎలాంటి ఆధారాల్లేవని తేల్చిచెప్పింది.

Samayam Telugu 4 Apr 2021, 3:08 pm
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై ఘాటుగా స్పందించింది. ట్యాంపరింగ్ చేశారని మమత చేసిన ఆరోపణలను ఈసీ తోసిపుచ్చుతూ ఘాటైన లేఖ రాసింది. ఏప్రిల్ 2న జరిగిన పశ్చిమ బెంగాల్ రెండో విడత పోలింగ్ సందర్భంగా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని మమత ఆరోపించారు. ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం కల్పించారంటూ ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు ఆమె ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
mamata


మమతా లేఖను పరిశీలించిన ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది. ట్యాంపరింగ్ ఆరోపణలు కొట్టిపారేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ మమతకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ట్యాంపరింగ్ ఆరోపణలపై ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారంటూ సీఎం మమతకు సమాధానమిచ్చింది. ఆ లేఖపై దీదీ ఎలా స్పందిస్తారో చూడాలి మరి!!

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.