West Bengal: ఐదో విడత భారీగానే పోలింగ్.. టీఎంసీ, బీజేపీ ఘర్షణ
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మరో ఘట్టం ముగిసింది. చెదురుమదురు ఘటనల మధ్య ఐదో విడత పోలింగ్ ముగిసింది. టీఎంసీ, బీజేపీ మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. పలుచోట్ల కార్యకర్తలు ఘర్షణకు దిగారు.
Samayam Telugu 17 Apr 2021, 9:06 pm
ప్రధానాంశాలు:
- ముగిసిన ఐదో విడత పోలింగ్
- పలుచోట్ల బీజేపీ, టీఎంసీ మధ్య ఘర్షణ
- స్వల్ప ఉద్రిక్తతల నడుమ భారీగా పోలింగ్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఐదో విడత పోలింగ్ ముగిసింది. ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల సమయానికి 78.36 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోని ఆరు జిల్లాల పరిధిలో 45 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఐదో విడతలో ఎన్నికలు జరిగాయి. అత్యధికంగా జల్పాయ్గురి జిల్లాలో 81.73 శాతం పోలింగ్ నమోదైంది. పుర్బా బర్ధమాన్లో 81.72 శాతం, నదియా జిల్లాలో 81.57, నార్త్ 24 పరగణాల జిల్లాలో 74.83, డార్జిలింగ్ 74.31, కలింపొంగ్ 69.56 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సందర్భంగా అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని ఎన్నికల కమిషన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బిధాన్నగర్లోని శాంతినగర్లో అధికార టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది గాయాలపాలయ్యారు. సిలిగురి నియోజకవర్గంలో ఓ పోలింగ్ బూత్ వద్ద టీఎంసీ, సీపీఎం మధ్య వివాదం తలెత్తింది. నార్త్ 24 పరగణాల జిల్లాలో టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణ జరగిందని.. ఓట్లు వేయకుండా కొద్దిసేపు అడ్డుకున్నారు.
Also Read:
Also Read: