యాప్నగరం

బీజేపీకి ఓటేయలేదని బీఎస్ఎఫ్ సిబ్బందితో దాడి.. మాజీ సీఎం ట్వీట్

జమ్మూలో తమకు ఓటేయడానికి నిరాకరించిన వారిపై బీఎస్ఎఫ్ బలగాలతో బీజేపీ దాడి చేయిస్తోందని పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ ఆరోపించారు.

Samayam Telugu 11 Apr 2019, 1:48 pm
జమ్మూ కశ్మీర్లో తమకు ఓటేయని వారిపై బీఎస్ఎఫ్ బలగాలతో బీజేపీ దాడి చేయిస్తోందని పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. గెలవడం కోసం బీజేపీ సైన్యాన్ని కూడా ఉపయోగిస్తోందని ఆమె విమర్శించారు. పోలింగ్ కేంద్రం ముందు కొందరు వ్యక్తులు బీజేపీ డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తున్న వీడియోను ఆమె ట్వీట్ చేశారు. బీజేపీకి ఓటేయని ఓ వ్యక్తిపై బీఎస్ఎఫ్ సిబ్బంది దాడి చేశారని ఆమె తెలిపారు.
Samayam Telugu mufti1.


ఎట్టి పరిస్థితుల్లోనైనా అధికారంలోకి రావాలని కాషాయ పార్టీ భావిస్తోందని మెహబూబా విమర్శించారు. ఈ వీడియో జమ్మూలోని ఓ పోలింగ్ వద్ద తీసిందని ఆమె తెలిపారు.
తొలి దశ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా జమ్మూ కశ్మీర్లోని జమ్మూ, బారాముల్లా నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఎన్నికలను బహిష్కరించాలని వేర్పాటువాదులు పిలుపునిచ్చినప్పటికీ... ఓటర్లు ఓట్లేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో 4489 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.