యాప్నగరం

టైమ్స్ నౌ సర్వే వైసీపీకి 18.. టుడేస్ చాణక్య సర్వే టీడీపీకి మెజార్టీ

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై పలు సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఒక్కో విధంగా ఉన్నాయి. కొన్ని టీడీపీకి, మరికొన్ని వైసీపీకి మెగ్గు ఉన్నట్టు తెలిపాయి.

Samayam Telugu 22 May 2019, 11:24 am
ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభతోపాటు అసెంబ్లీకి కూడా తొలి దశలోనే ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వహించారు. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ సీట్లకు ఒకే విడతలో ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో అధికార టీడీపీ, ప్రతిపక్షం వైసీపీ, జనసేన ప్రధానంగా పోటీపడ్డాయి. సుదీర్ఘంగా 70 రోజుల పాటు సాగిన ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా 17 వ లోక్‌సభ ఫలితాలను మే 23న వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కేంద్రంలో మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తుందని తెలిపినా, ఏపీలో మాత్రం ఒక్కో రకమైన సర్వేను వెల్లడించాయి.
Samayam Telugu elections2


ఆంధ్రప్రదేశ్‌లో ఆర్జీ ఫ్లాష్ టీం పేరుతో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే నిర్వహించారు. జనవరి నుంచి ఆయన ఈ సర్వేను నిర్వహించినట్టు తెలిపారు. ఏడు విడతల్లో అనేక నివేదికలను పరిశీలించి, శాస్త్రీయంగా సర్వే నిర్వహించినట్టు ఆయన వెల్లడించారు.

టైమ్స్ నౌ- వీఎంఆర్ సర్వే
టీడీపీ: 7
వైసీపీ: 18
జనసేన: 0
బీజేపీ: 0
ఇతరులు: 0

లగడపాటి సర్వే
టీడీపీ: 15 +/- 2
వైసీపీ: 10+/- 2
జనసేన: 0
ఇతరులు: 0 నుంచి 1

ఇండియ టుడే సర్వే
టీడీపీ: 4- 6
వైసీపీ: 18- 20
జనసేన: 1
ఇతరులు- 0

ఐఎన్ఎస్ఎస్ మీడియా సర్వే
టీడీపీ: 17
వైసీపీ: 7
జనసేన: 1
ఇతరులు- 0

న్యూస్-18 సర్వే
టీడీపీ: 10- 12
వైసీపీ: 13-14
జనసేన: 0
బీజేపీ- 1
ఇతరులు- 0

సీ ఓటర్ సర్వే

టీడీపీ: 14
వైసీపీ: 11
జనసేన: 0
బీజేపీ- 0
ఇతరులు- 0

ఎలైట్ ఎలక్టోరల్ సర్వే
టీడీపీ: 17
వైసీపీ: 8
జనసేన: 0
బీజేపీ: 0
ఇతరులు: 0

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.