యాప్నగరం

Telangana Elections: రామ్ చరణ్ అత్త ఓటు గల్లంతు.. ఇది క్రైమ్ అంటూ ఆగ్రహం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్త, ఉపాసన తల్లి శోభన కామినేని ఓటు గల్లంతు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు.

Samayam Telugu 11 Apr 2019, 12:48 pm
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్త, ఉపాసన తల్లి శోభన కామినేని ఓటు గల్లంతు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. ఉదయం హైదరాబాద్‌లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్లిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఓటర్ కార్డ్‌తో పోలింగ్ కేంద్రానికి వెళ్లినా తన ఓటు గల్లంతు అయ్యిందని చెబుతున్నారని ఇది చాలా దారణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారామె.
Samayam Telugu రామ్ చరణ్ అత్త ఓటు గల్లంతు


భారతీయ మహిళగా ప్రజాస్వామ్య బద్ధం ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన తనకు ఓటు వేసుకుని అవకాశం లేకుండా డిలీట్ చేశారని.. నేను భారతీయ మహిళను కాదా? అంటూ ప్రశ్నించారు. నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నానని.. కాని పార్లమెంట్ ఎన్నికలకు తన ఓటును తొలగించారన్నారు. ఇది చాలా క్రైమ్ అంటూ ఫైర్ అయ్యారు సోభన కామినేని.

కాగా.. సోభన కామినేని చెల్లెలు సంగీత భర్త కె. విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ తరుపున చేవెళ్ల నుండి ఎంపీ అభ్యర్ధి బరిలో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.