యాప్నగరం

BJP Candidates 1st List: బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా.. ఎవరు ఎక్కడి నుంచి పోటీ?

బీజేపీ 184 మంది ఎంపీ అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. ప్రధాని మోదీ మరోసారి వారణాసి నుంచి బరిలో దిగుతున్నారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే..?

Samayam Telugu 21 Mar 2019, 8:43 pm
లోక్ సభ ఎన్నికల బరిలో దిగుతున్న 184 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సెక్రటరీ జేపీ నడ్డా తొలి జాబితాను గురువారం సాయంత్రం విడుదల చేశారు. తొలి జాబితాలో 20 రాష్ట్రాలను కవర్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి పోటీ చేస్తుండగా.. బీజేపీ చీఫ్ అమిత్ షా గాంధీ నగర్ నుంచి లోక్ సభ బరిలో దిగుతున్నారు. అద్వానీ ప్రాతినిధ్యం వహిస్తోన్న స్థానం నుంచి షా పోటీ చేస్తుండటం గమనార్హం. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లక్నో నుంచి పోటీ చేయనున్నారు. నితిన్ గడ్కరీ నాగ్‌పూర్ నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు.
Samayam Telugu bjp.


అమేథీ నుంచి రాహుల్ గాంధీకి పోటీగా కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ బరిలో దిగబోతున్నారు. అనంత్ కుమార్ హెగ్డే ఉత్తర కన్నడ నుంచి పోటీ చేస్తారు. సదానంద గౌడ బెంగళూరు నార్త్ నుంచి పోటీ చేస్తారు. క్రీడల మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ జైపూర్ రూరల్ నుంచి బరిలో దిగుతారు.

చదవండి: 184 మందితో తొలి జాబితా ఇదే

2014లో ప్రధాని మోదీ వారణాసి, వడోదర నుంచి పోటీ చేశారు. రెండు స్థానాల్లోనూ గెలిచిన ఆయన.. వారణాసిని అట్టిపెట్టుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.