యాప్నగరం

అమేథీలో రాహుల్ ఓటమికి కారణం ఇదేనట!

సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని వాయునాడ్‌లో గెలుపొందిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తన కంచుకోట ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథి స్థానంలో మాత్రం ఓటమి చవిచూశారు.

Samayam Telugu 2 Jun 2019, 11:41 am
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు చోట్ల పోటీచేయగా ఒక స్థానంలోనే విజయం సాధించిన విషయం తెలిసిందే. కేరళలోని వాయునాడ్‌లో గెలుపొందిన రాహుల్, తన కంచుకోట యూపీలోని అమేథిలో మాత్రం ఓటమి చవిచూశారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ 55,120 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కంచుకోటలో ఓటమికి గల కారణాలను తెలుసుకోడానికి కాంగ్రెస్ పార్టీ ద్విసభ్య కమిటీని నియమించింది. ఏఐసీసీ కార్యదర్శి జుబైర్‌ ఖాన్‌, సోనియాగాంధీ ప్రతినిధి కె.ఎల్‌.శర్మలతో కూడిన ద్విసభ్య కమిటీ శుక్రవారం శాసనసభ నియోజకవర్గాల వారీగా సంప్రదింపులు ప్రారంభించింది. ఈ కమిటీ మూడు రోజుల పాటు అమేథీలో పర్యటించి రాహుల్ ఓటమికి కారణాలను విశ్లేషించనుంది.
Samayam Telugu 180862-rahul


సమాజ్‌వాదీ, బహుజన సమాజ్‌ పార్టీలకు చెందిన స్థానిక నేతలు, కార్యకర్తలు సహకరించకపోవడం వల్లే రాహుల్‌ గాంధీ ఓడిపోయారని కాంగ్రెస్‌ తేల్చింది. యూపీలో ఎస్పీ- బీఎస్పీలు కూటమిగా బరిలోకి దిగిన విషయం విదితమే. అయితే, ఇందులో కాంగ్రెస్‌ భాగస్వామి కాకపోయినా అమేథీలో తమ అభ్యర్థిని ఎస్పీ-బీఎస్పీ నిలబెట్టలేదు. అయినా సరే బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ విజయం సాధించారు. ఎస్పీ, బీఎస్పీ ఓట్ల గణాంకాలను పరిశీలిస్తే రాహుల్‌ విజయానికి వారు సహకరించలేదని స్పష్టమైందని అమేథీ కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు. కూటమి తరఫున అభ్యర్థిని నిలబెట్టకపోయినా, కాంగ్రెస్‌ అధ్యక్షుడి విజయానికి సహకరించలేదని వివరించారు. అలాగే గ్రామస్థాయిలోనూ కమిటీ సమీక్షిస్తుందని యూపీ కాంగ్రెస్‌ కమిటీ సభ్యుడు రాజీవ్‌సింగ్‌ తెలిపారు. బ్లాక్‌, పంచాయతీల అధ్యక్షులతోనూ సమావేశం కానుందని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.