యాప్నగరం

UP Elections: యోగి, మాయావతిపై ఈసీ కన్నెర్ర.. ప్రచారంపై నిషేధం

యూపీలో రెండో దశ ఎన్నికలు ఏప్రిల్ 18న జరగనున్నాయి. భావోద్వేగాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన యోగి, మాయావతి ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం విధించింది.

Samayam Telugu 15 Apr 2019, 5:04 pm
కీలక రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో నేతలపై ఎన్నికల సంఘం కన్నెర్ర జేసింది. భావోద్వేగాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన మాయావతి, యోగి ఆదిత్యనాథ్‌లు ప్రచారం నిర్వహించకుండా ఈసీ వేటేసింది. మూడు రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా యోగిపై, రెండ్రోజులపాటు ప్రచారం నిర్వహించకుండా మాయావతిపై ఈసీ నిషేధం విధించింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడంతో.. ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. గత శుక్రవారం వీరిద్దరికీ నోటీసులు ఇచ్చిన ఈసీ.. 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123లో ఉన్న సబ్ సెక్షన్ 3 ప్రకారం వీరికి ఈసీ నోటీసులు జారీ చేసింది.
Samayam Telugu Yogi_Adityanath_and_Mayawati


ఏప్రిల్ 18న యూపీలోని 8 నియోజకవర్గాలు సహా దేశంలోని 97 నియోజకవర్గాల్లో రెండో దశ పోలింగ్ జరగనుంది. మంగళవారం వరకు మాత్రమే పార్టీలు ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది.

ఏప్రిల్ 7న మాయావతి మాట్లాడుతూ.. మీరెవరూ బంధుత్వం, స్నేహం పేరిట ఓట్లను చీల్చొద్దని ముస్లింలకు మాయావతి సూచించారు. యూపీలో బీజేపీని ఓడించాలంటే.. ఓట్లు చీలొద్దన్నారు. మహకూటమి అభ్యర్థులకే ఓటేయాలని ఆమె ముస్లింలకు పిలుపునిచ్చారు.

దీనికి బదులుగా మీరట్‌లో నిర్వహించిన ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ... మహాకూటమికి ముస్లింల ఓట్లే కావాలంటే.. మిగతా వాళ్ల ఓట్లు వద్దా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు అలీ పట్ల విశ్వాసం ఉంటే.. మాకు భజరంగభళీ పట్ల విశ్వాసం ఉందన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భజరంగభళీని విశ్వసించేవాళ్లు తమకు సపోర్ట్ చేయరని బీఎస్పీకి చురకలు అంటించారు. బీఎస్పీ దేశంలో గ్రీన్ వైరస్‌ను వ్యాపింపజేయాలని చూస్తోందని విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.