యాప్నగరం

సీఎం కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు

హిందువులను కించపరిచే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. టీఆర్‌ఎస్ అధినేతకు నోటీసులు జారీ చేసింది.

Samayam Telugu 10 Apr 2019, 6:14 pm
టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. హిందువులను కించపరిచే విధంగా కేసీఆర్‌ వ్యాఖ్యలు చేశారంటూ విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు చేసిన ఫిర్యాదుపై చర్యలు చేపట్టిన ఈసీ కేసీఆర్‌కు నోటీసులు పంపింది. మార్చి 17న కరీంనగర్‌‌లో టీఆర్‌ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో హిందువులను ఉద్దేశించి కేసీఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని అభ్యంతరం వ్యక్తంచేస్తూ రామరాజు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
Samayam Telugu ec
ఎన్నికల సంఘం


ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సీఎం కేసీఆర్‌ ఉల్లంఘించారంటూ రామరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఈసీ.. సీఎం కేసీఆర్‌కు మంగళవారం (ఏప్రిల్ 9) నోటీసులు జారీ చేసింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.