యాప్నగరం

21న వద్దు.. ఫలితాల తర్వాతే సమావేశం: బాబుతో మమత

ఏపీ సీఎం చంద్రబాబు బెంగాల్‌లో రెండ్రోజుల పాటు మమత పార్టీకి మద్దతుగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 21వ తేదీ సమావేశం గురించి కూడా ఇద్దరూ చర్చించుకున్నట్లు సమాచారం.

Samayam Telugu 11 May 2019, 9:42 am
బీజేపీయేతర పక్షాలన్నీ ఈ నెల 21న ఢిల్లీలో నిర్వహించనున్న సమావేశం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సూచనతో ఈ సమావేశం తేదీ మారే అవకాశముంది. ఎన్నికల ఫలితాలకు రెండ్రోజుల ముందు అంటే 21వ తేదీన సమావేశం కావాలని మిత్రపక్షాలన్నీ గతంలోనే నిర్ణయించుకున్నాయి. అయితే ఈ సమావేశం ఫలితాల తర్వాత నిర్వహిస్తే బాగుంటుందని, ముందుగా అవసరం లేదని మమత అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
Samayam Telugu mamata


ఏపీ సీఎం చంద్రబాబు బెంగాల్‌లో రెండ్రోజుల పాటు మమత పార్టీకి మద్దతుగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 21వ తేదీ సమావేశం గురించి కూడా ఇద్దరూ చర్చించుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలకు ముందే సమావేశం పెడితే కొన్ని పార్టీలు రాకపోవచ్చని, అదే ఫలితాల తర్వాత అయితే సీట్లపై క్లారిటీ వస్తుంది కాబట్టి అందరూ వచ్చే అవకాశం ఉంటుందని అభిప్రాయపడినట్లు సమాచారం. ఫలితాల తర్వాత ఎవరెవరు కలిసివస్తారు, కూర్పు ఎలా ఉండాలి అన్న దానిపై స్పష్టత వస్తుందన్నారు.

మమత సూచనపై చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఆమె అభిప్రాయంలో కూడా కొంత వాస్తవం ఉండటంతో సమావేశం వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.