యాప్నగరం

Sri Rama Navami: శాంతిని చెడగొట్టేందుకే.. శ్రీరామనవమి ర్యాలీలు!

శ్రీరామనవమి సందర్భంగా ర్యాలీలు నిర్వహించడంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. రాష్ట్రంలోని శాంతియుత వాతావరణాన్ని బీజేపీ చెడగొడుతుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Samayam Telugu 13 Apr 2019, 8:01 pm
శ్రీరామనవమి సందర్భంగా.. ఆయుధాలతో ర్యాలీలు నిర్వహించడంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. రాష్ట్రంలోని శాంతియుత వాతావరణాన్ని బీజేపీ చెడగొడుతుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మతాన్ని ఉపయోగించుకొని బీజేపీ రాజకీయంగా లబ్ధి పొందాలని భావిస్తోందని విమర్శించారు. మతం పేరిట బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్న ఆమె.. ఎన్నికల ముందు బెంగాల్ ప్రజలను విడగొట్టేందుకు మతాన్ని ఆయుధంగా ఉపయోగిస్తోందన్నారు. హింసాత్మక రాజకీయాలకు బెంగాల్‌లో స్థానం లేదన్నారు.
Samayam Telugu mamata.


బీజేపీ కార్యకర్తలు ఖడ్గాలు, బల్లెంలతో ర్యాలీలు చేపడుతున్నారని మమత విమర్శించారు. డార్జిలింగ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె ఈ ఆరోపణలు చేశారు. ఖడ్గాలతో మీరు ఎవరి గొంతు కోయాలని అనుకుంటున్నారు? ఎవరి తల నరకాలని అనుకుంటుున్నారని ఆమె బీజేపీ నేతలను ప్రశ్నించారు.

బెంగాల్‌లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ నిర్వహించనీయమని మమత పునరుద్ఘాటించారు. డార్జిలింగ్ సీటును భూమి పుత్రులకు ఇచ్చామన్న ఆమె.. బీజేపీలా ఇక్కడి సీటును మణిపూర్ వాళ్లకు ఇవ్వలేదన్నారు. బీజేపీకి డార్జిలింగ్‌లో అభ్యర్థి దొరక్కపోవడంతో మణిపూర్ నుంచి తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.