యాప్నగరం

మోదీ బాబు, అమిత్ బాబు.. నాతో ఆ విషయంలో పోటీ పడండి: మమత

ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సవాల్ విసిరారు. దమ్ముంటే తనతో మంత్రోచ్ఛారణలో పోటీ పడాలని ఛాలెంజ్ చేశారు.

Samayam Telugu 19 Mar 2019, 9:34 pm
బీజేపీ టార్గెట్‌గా విమర్శలు చేసే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి ఆ పార్టీ నాయకత్వానికి సవాల్ విసిరారు. సంస్కృతంలో మంత్రాలు చదవడంలో తనతో పోటీ పడాలని ఆమె మోదీ, అమిత్ షా‌కు ఛాలెంజ్ విసిరారు. కోల్‌కతాలో మాట్లాడిన ఆమె.. నుదుటన తిలకం పెట్టుకోవడమే ఒకరి మతానికి సూచిక కాదన్నారు. పూజ చేయడమంటే తిలకం పెట్టుకోవడం కాదు.. అమిత్ బాబు, మోదీ బాబు.. రండి మంత్రోచ్ఛారణలో నాతో పోటీ పడండి. ఎవరికి ఎక్కువ సంస్కృత మంత్రాలు తెలుసో చూద్దామని ఆమె సవాల్ చేశారు.
Samayam Telugu mamata


ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇలాంటి సందర్భంలో ప్రధాని మోదీ, అమిత్ షాలకు మమత సవాల్ విసరడం గమనార్హం.

డోలిజాతర, హోలీ సందర్భంగా మతసామరస్యం పాటించాలని మమత కోరారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కల్పించొద్దని ఆమె సూచించారు. బెంగాల్‌లో మతాలకు అతీతంగా అన్ని పండుగలు జరుపుకొంటామని ఆమె తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.