యాప్నగరం

మా, మాటీ, మానుష్.. పియానో వాయిస్తూ దీదీ ప్రార్థన, వీడియో వైరల్

తనదైన వ్యూహాలు, విమర్శలతో ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టించిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నిలక ఫలితాల వేళ పియానోతో సేద తీరారు. ప్రత్యేక గీతం వాయిస్తున్న వీడియో షేర్ చేశారు.

Samayam Telugu 22 May 2019, 10:39 pm
న్నికల కదనరంగంలో దూసుకెళ్తూ నిన్నటివరకూ ప్రతిపక్షాలను ఎడాపెడా వాయించేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. పియానో వాయిస్తూ సేద తీరారు. ఎన్నికల ఫలితాలకు ముందు దొరికిన విరామం సమయాన్ని ఈరకంగా గడిపారు. సభలు, సమావేశాలు, సంప్రదింపులు, రాజకీయ వ్యూహాలతో కూడిన బిజీ లైఫ్ నుంచి కాస్త రిలీఫ్ పొందారు.
Samayam Telugu mamata
మమతా బెనర్జీ


కేంద్రంలో మోదీ సర్కార్‌ను వరసగా రెండోసారి అధికారంలోకి రాకుండా చేయడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్న దీదీ.. తనకు దొరికిన కాస్త విరామ సమయాన్ని పియానో వాయిస్తూ ఆహ్లాదంగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను బుధవారం (మే 22) తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా పోస్టు చేశారు. ‘అమ్మ, మట్టి, మనిషి’కి ఇది అంకితం అని పేర్కొన్నారు. ఫలితాల సమయం దగ్గర పడుతున్న తరుణంలో మాతృభూమి కోసం ప్రార్థన చేసినట్లు తెలిపారు.

‘మా, మాటి, మానుష్’ అంటూ పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఇచ్చిన నినాదం బాగా పాపులరైంది. కార్యకర్తలకు, అభిమానులకు బాగా కనెక్టైంది. మమతా బెనర్జీ సదరు వీడియోను పోస్టు చేసిన గంటలోనే సుమారు 4 వేల షేర్లు, వేలాది లైక్‌లు రావడమే ఇందుకు తార్కాణం.

చంద్రబాబు నాయుడు, అఖిలేశ్ యాదవ్, మాయావతి, కేజ్రీవాల్, స్టాలిన్ లాంటి నేతల అండతో కేంద్రంలో చక్రం తిప్పాలని చూస్తున్న మమతా బెనర్జీకి ఓటర్లు పట్టం కడతారా? విపక్షాలు భావిస్తున్నట్లు హంగ్ పార్లమెంట్‌కు ఏవైనా అవకాశాలున్నాయా? అనే అంశం మరికొద్ది గంటల్లో తేలనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.