యాప్నగరం

TRS: కారెక్కిన నామా.. ఖమ్మం టిక్కెట్ కన్ఫార్మ్!

ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు గురువారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆయనకు ఖమ్మం ఎంపీ టిక్కెట్ కేటాయించినట్లు సమాచారం.

Samayam Telugu 21 Mar 2019, 3:11 pm

ప్రధానాంశాలు:

  • టీడీపీ నేత నామా నాగేశ్వరరావు కారెక్కారు.
  • కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
  • ఆయనకు ఖమ్మం ఎంపీ టిక్కెట్ కన్ఫార్మ్ చేసినట్లు సమాచారం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ, టీడీపీ నేత నామా నాగేశ్వరరావు గురువారం టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా నామా కారెక్కారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన్ని ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
నామా నాగేశ్వరరావు డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఇటీవల ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిన టీఆర్ఎస్ ఆయనకు గాలం వేస్తూ వచ్చింది. ఇటీవలే ఆయన ఫాంహౌస్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. చర్చలు ఫలించడంతో గురువారం కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్ తరపున ఆయన ఖమ్మం ఎంపీగా పోటీ చేయడం ఖాయమైనట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.