తాజా లోక్సభ ఎన్నికల్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అమేధీతో పాటు కేరళలోని వాయనాడ్ నుంచి కూడా ఆయన బరిలో నిలుస్తున్నారు. దక్షిణాదిలో పార్టీకి ఊపు తెచ్చేందుకే రాహుల్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తమ రాష్ట్రం నుంచే పోటీ చేయాలని తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ఆయనకు ప్రతిపాదించగా పార్టీకి కంచుకోటగా ఉన్న కేరళలోని వయనాడ్ను ఆయన ఎంపిక చేసుకున్నారు. వయనాడ్ నియోజకవర్గంలో నేడు రాహుల్గాంధీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన నామినేషన్ దాఖలు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపారు. ఈ సందర్భంగా వయనాడ్లో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. రాహుల్తో పాటు ప్రియాంక కూడా రోడ్ షోలో పాల్గొంటారని కేరళ కాంగ్రెస్ ఇన్ఛార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ తెలిపారు. రాహుల్కు ఘనస్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి.
వాయనాడ్లో నేడు రాహుల్ గాంధీ నామినేషన్
కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న రాహుల్ గాంధీ నేడు నామినేషన్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన భారీ రోడ్ షో నిర్వహించనున్నారు.
Samayam Telugu 4 Apr 2019, 8:41 am
ప్రధానాంశాలు:
- వయనాడ్లో నేడు రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
- ఆయనతో పాటు ప్రియాంక కూడా రానున్నారు.