యాప్నగరం

సీఎంపైకి చెప్పులు.. ప్రచారంలో చేదు అనుభవం

సీఎంపైకి చెప్పులు విసిరిన వ్యక్తిని పోలీసు సిబ్బంది ఇంతవరకూ పట్టుకోలేదు. ఘటనపై భద్రతా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి సభలో భద్రతా సిబ్బంది కొరవడటం ప్రశ్నార్థకంగా మారింది.

Samayam Telugu 1 Apr 2019, 9:02 pm
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఓ రోడ్డు షోలో పాల్గొన్న తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి చేదు అనుభవం ఎదురైంది. తంజావూరులో ప్రచారం నిర్వహిస్తుండగా ఆయనపైకి గుర్తు తెలియని వ్యక్తి చెప్పులు విసిరాడు. పళనిస్వామి మాట్లాడుతుండగా ఆయనపైకి చెప్పులు ఎగిరి వచ్చిపడ్డాయి. ఆదివారం (మార్చి 31) రాత్రి జరిగిన ఈ ఘటన తమిళనాడులో సంచలనంగా మారింది.
Samayam Telugu Palani
సీఎం పళనిస్వామి

సీఎంపైకి చెప్పులు విసిరిన వ్యక్తిని పోలీసు సిబ్బంది ఇంతవరకూ పట్టుకోలేదు. ఘటనపై భద్రతా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. భద్రతా సిబ్బంది తక్కువగా ఉండటం వల్లే ఈ ఘటన జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి సభలో భద్రతా సిబ్బంది కొరవడటం ప్రశ్నార్థకంగా మారింది.

లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో పార్టీల ప్రచారం జోరందుకుంది. తమిళనాడులో ఏప్రిల్ 18న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 39 లోక్‌సభ స్థానాలున్నాయి. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానుండటంతో అధికార, విపక్ష పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.

ఓ ముఖ్యమంత్రిపై బహిరంగంగా చెప్పులు విసిరిన ఘటన ఇదే తొలిసారేం కాదు. గతేడాది బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ఓ వ్యక్తి చెప్పువిసిరాడు. మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పైనా ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి ఏకంగా ఆయన కార్యాలయంలోకి వెళ్లి ఇంక్‌తో దాడి చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.