యాప్నగరం

మంగళగిరిలో ఓటు రేటు రూ.30 వేలు?

ఎన్నికల వేళ ఏపీలో నాయకుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మంగళగిరిలో ఓటు రేటును రూ.30 వేలకు పెంచారని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

Samayam Telugu 5 Apr 2019, 6:30 pm
ఎన్నికల వేళ ఏపీలో నాయకుల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. ట్విట్టర్లో చంద్రబాబు, పవన్, లోకేశ్ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తోన్న విజయసాయి రెడ్డి.. మంగళగిరిలో ఓటు రేటును రూ. 30 వేలకు పెంచారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఇప్పటికే పంచిన రూ.10 వేలు కాకుండా.. మరో రూ.20 వేలు ఇస్తామని కార్యకర్తలు ఇంటింటికి తిరిగి చెబుతున్నారట. లోకేశ్‌ బాబు ఓటుకు రూ.50 వేలు ఇవ్వమంటే మీరు మధ్యలో బొక్కి మా మొఖాన రూ.10 వేలు కొడతారా అని జనాలు తరుముతున్నారట. మందలగిరిని ఏం చేయాలని అనుకుంటున్నాడో మాలోకం’ అని విజయసాయి రెడ్డి వ్యంగ్యంగా ట్వీట్ వదిలారు.
Samayam Telugu mangalagiri


‘హెరిటేజ్ పాల వ్యాన్లు, అనుకూల మీడియా ఓబీ వ్యాన్లు, పేపరు వ్యాన్లలో చంద్రబాబు డబ్బు మూటలు తరలి వెళ్తున్నాయి. తమిళనాడు నుంచి చేపల పడవల్లో కూడా తీర ప్రాంత జిల్లాలకు డబ్బు చేరవేస్తున్నారు. దోచుకున్న ప్రజాధనాన్ని వెదజల్లి ఓటర్లను కొనుగోలు చేయొచ్చనుకుంటున్నార’ని వైఎస్ఆర్సీపీ ఎంపీ మరో ట్వీట్ చేశారు.
‘జాబు కావాలంటే బాబు రావాలన్నారు. అది నమ్మి జనం మీకు ఓట్లేస్తే పప్పుకి తప్ప ఎవరికీ జాబు రాలేదు. ఇప్పుడు ‘మీ భవిష్యత్తు – నా బాధ్యత’ అంటున్నారు. మళ్ళీ నమ్మి ఓటేస్తే రేపు లోకేష్‌ భవిష్యత్తే నా బాధ్యత అంటూ మరో యూటర్న్‌ తీసుకోరన్న గ్యారెంటీ ఏంటి బాబూ అని ప్రజలు ప్రశ్నిస్తున్నార’ని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.