తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఇక వాయనాడ్ నుంచి రాహుల్ బరిలో నిలుస్తున్నారు. దక్షిణాదిలో కాంగ్రెస్కు జవసత్వాలు నింపేందుకు రాహుల్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో అనూహ్య మార్పులు ఖాయమని, ఢిల్లీలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందని తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ కూడా నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందని, కేసీఆర్ చక్రం తిప్పుతారని వ్యాఖ్యానించారు. ఆంధోల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. ఎన్నికలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఏం జరుగుతోంది? ప్రధాన పార్టీలు ప్రచారాస్త్రాలేంటి? కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అప్డేట్స్ ఏంటి? తదితర రాజకీయ, ఎన్నికల ప్రధానాంశాలను ఇక్కడ మేం అందిస్తున్నాం..
హైదరాబాద్లో పవన్-మాయావతి సభ.. ట్రాఫిక్ ఆంక్షలు
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, బీఎస్పీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణలోని ఎన్నికల ప్రచారంలో మాయావతి పాల్గొంటున్నారు. మంగళ, బుధవారాలు ఏపీలో ప్రచారం నిర్వహించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో మాయావతి, పవన్ కళ్యాణ్లు పాల్గొంటున్నారు. తొలిసారిగా తెలంగాణలో జరుగుతోన్న ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తోంది. మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్సభ స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి. వాయనాడ్లో నేడు రాహుల్ గాంధీ నామినేషన్
తాజా లోక్సభ ఎన్నికల్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అమేధీతో పాటు కేరళలోని వాయనాడ్ నుంచి కూడా ఆయన బరిలో నిలుస్తున్నారు. దక్షిణాదిలో పార్టీకి ఊపు తెచ్చేందుకే రాహుల్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తమ రాష్ట్రం నుంచే పోటీ చేయాలని తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ఆయనకు ప్రతిపాదించగా పార్టీకి కంచుకోటగా ఉన్న కేరళలోని వయనాడ్ను ఆయన ఎంపిక చేసుకున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
న్యాయ్’ దెబ్బ.. బీజేపీకి 30 సీట్లు గల్లంతే!
ఎన్నికల నోటిఫికేషన్ వరకు ఉత్సాహంగా ఉన్న బీజేపీలో ఎన్నికలు సమీపించేకొద్దీ ఆందోళన కనిపిస్తోంది. ఈసారి కూడా తమదే అధికారం అని చంకలు గుద్దుకున్న కమలదళాన్ని ఒకే ఒక్క ప్రకటనతో ఆలోచనలో పడేశారు ఏఐసీపీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కనీస ఆదాయం లేని పేద కుటుంబాలకు నెలకు రూ.6వేల చొప్పున ఏడాదికి రూ.72వేలు బ్యాంకు ఖాతాలో వేస్తామని రాహుల్ ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం తొణికిసలాడుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
కేసీఆర్ ప్రధాని.. కేటీఆర్ సీఎం.. 'అలీ' సాబ్ నయా స్ట్రాటజీ
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు జాతీయ స్థాయి రాజకీయాలను శాసించే సత్తా ఉందంటున్నారు మంత్రి మహమూద్ అలీ. సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో అనూహ్య మార్పులు ఖాయమంటున్నారు. ఢిల్లీలో ప్రాంతీయ పార్టీల హవా ఖాయమని.. టీఆర్ఎస్ కూడా నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
హైదరాబాద్లో పవన్-మాయావతి సభ.. ట్రాఫిక్ ఆంక్షలు
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, బీఎస్పీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణలోని ఎన్నికల ప్రచారంలో మాయావతి పాల్గొంటున్నారు. మంగళ, బుధవారాలు ఏపీలో ప్రచారం నిర్వహించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో మాయావతి, పవన్ కళ్యాణ్లు పాల్గొంటున్నారు. తొలిసారిగా తెలంగాణలో జరుగుతోన్న ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తోంది. మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్సభ స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
తాజా లోక్సభ ఎన్నికల్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అమేధీతో పాటు కేరళలోని వాయనాడ్ నుంచి కూడా ఆయన బరిలో నిలుస్తున్నారు. దక్షిణాదిలో పార్టీకి ఊపు తెచ్చేందుకే రాహుల్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తమ రాష్ట్రం నుంచే పోటీ చేయాలని తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ఆయనకు ప్రతిపాదించగా పార్టీకి కంచుకోటగా ఉన్న కేరళలోని వయనాడ్ను ఆయన ఎంపిక చేసుకున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
న్యాయ్’ దెబ్బ.. బీజేపీకి 30 సీట్లు గల్లంతే!
ఎన్నికల నోటిఫికేషన్ వరకు ఉత్సాహంగా ఉన్న బీజేపీలో ఎన్నికలు సమీపించేకొద్దీ ఆందోళన కనిపిస్తోంది. ఈసారి కూడా తమదే అధికారం అని చంకలు గుద్దుకున్న కమలదళాన్ని ఒకే ఒక్క ప్రకటనతో ఆలోచనలో పడేశారు ఏఐసీపీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కనీస ఆదాయం లేని పేద కుటుంబాలకు నెలకు రూ.6వేల చొప్పున ఏడాదికి రూ.72వేలు బ్యాంకు ఖాతాలో వేస్తామని రాహుల్ ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం తొణికిసలాడుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
కేసీఆర్ ప్రధాని.. కేటీఆర్ సీఎం.. 'అలీ' సాబ్ నయా స్ట్రాటజీ
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు జాతీయ స్థాయి రాజకీయాలను శాసించే సత్తా ఉందంటున్నారు మంత్రి మహమూద్ అలీ. సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో అనూహ్య మార్పులు ఖాయమంటున్నారు. ఢిల్లీలో ప్రాంతీయ పార్టీల హవా ఖాయమని.. టీఆర్ఎస్ కూడా నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.