లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఐదో దశ పోలింగ్ సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జమ్ము కశ్మీర్లోని అనంత్నాగ్లో ఓ పోలింగ్ కేంద్రంపై ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. పుల్వామా జిల్లాలోని రోహ్మూ పోలింగ్ కేంద్రంపై ఉగ్రవాదులు ఈ దాడి జరిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇదే తొలి ఉగ్రవాదుల దాడి కావడం గమనార్హం. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఐదో దశ ఎన్నికల సందర్భంగా బిహార్లో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఛాప్రా పోలింగ్ బూత్ నెంబర్ 131లో ఓ వ్యక్తి ఈవీఎంను ధ్వంసం చేశాడు. నిందితుడిని రంజిత్ పాశ్వాన్గా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని పలు చోట్ల తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం వర్గీయుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
బెంగాల్లోని బారక్పూర్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. తనపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేసినట్లు బారక్పూర్ బీజేపీ అభ్యర్థి అర్జున్ సింగ్ ఆరోపించారు. తమ పార్టీకి చెందిన కొంత మంది కార్యకర్తలను ఓటు వేయకుండా అడ్డుకున్నారని.. దీనిపై ఎన్నికల అధికారులను సంప్రదించడానికి వెళ్లగా తనపై టీఎంసీకి చెందిన కొంత మంది వ్యక్తులు దాడికి దిగారని ఆయన పేర్కొన్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడానికే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
ఉగ్రవాదుల భయం తదితర కారణాలతో జమ్ము కశ్మీర్లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. సోమవారం (మే 6) మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందిన వివరాల ప్రకారం.. కశ్మీర్లో కేవలం 6.54 శాతం పోలింగ్ నమోదైంది. అత్యంత సున్నిత ప్రాంతమైన అనంత్నాగ్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో శాంతి భద్రతల దృష్ట్యా మూడు, నాలుగు, ఐదు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. నేటితో ఇక్కడ ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.
పశ్చిమ బెంగాల్లో గత నాలుగు విడతల ఎన్నికల్లోనూ పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈసారి కేంద్ర సాయుధ బలగాలతో మరింత కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ.. పలు చోట్ల ఘర్షణలు జరిగాయి..
పోలింగ్ శాతాలు ఇలా..
మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 31.29 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రాల వారీగా పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి. బిహార్ - 24.49, జమ్ము కశ్మీర్ - 6.54, రాజస్థాన్ - 33.82, మధ్య ప్రదేశ్ - 31.46, ఉత్తర ప్రదేశ్ - 26.53, పశ్చిమ బెంగాల్ - 39.55, జార్ఖండ్ - 37.24 శాతం పోలింగ్ నమోదైంది. దేశంలోని 7 రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాల్లో ఐదో దశ పోలింగ్ కొనసాగుతోంది.
బెంగాల్లోని బారక్పూర్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. తనపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేసినట్లు బారక్పూర్ బీజేపీ అభ్యర్థి అర్జున్ సింగ్ ఆరోపించారు. తమ పార్టీకి చెందిన కొంత మంది కార్యకర్తలను ఓటు వేయకుండా అడ్డుకున్నారని.. దీనిపై ఎన్నికల అధికారులను సంప్రదించడానికి వెళ్లగా తనపై టీఎంసీకి చెందిన కొంత మంది వ్యక్తులు దాడికి దిగారని ఆయన పేర్కొన్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడానికే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
ఉగ్రవాదుల భయం తదితర కారణాలతో జమ్ము కశ్మీర్లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. సోమవారం (మే 6) మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందిన వివరాల ప్రకారం.. కశ్మీర్లో కేవలం 6.54 శాతం పోలింగ్ నమోదైంది. అత్యంత సున్నిత ప్రాంతమైన అనంత్నాగ్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో శాంతి భద్రతల దృష్ట్యా మూడు, నాలుగు, ఐదు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. నేటితో ఇక్కడ ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.
పశ్చిమ బెంగాల్లో గత నాలుగు విడతల ఎన్నికల్లోనూ పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈసారి కేంద్ర సాయుధ బలగాలతో మరింత కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ.. పలు చోట్ల ఘర్షణలు జరిగాయి..
పోలింగ్ శాతాలు ఇలా..
మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 31.29 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రాల వారీగా పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి. బిహార్ - 24.49, జమ్ము కశ్మీర్ - 6.54, రాజస్థాన్ - 33.82, మధ్య ప్రదేశ్ - 31.46, ఉత్తర ప్రదేశ్ - 26.53, పశ్చిమ బెంగాల్ - 39.55, జార్ఖండ్ - 37.24 శాతం పోలింగ్ నమోదైంది. దేశంలోని 7 రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాల్లో ఐదో దశ పోలింగ్ కొనసాగుతోంది.