యాప్నగరం

వణికిస్తున్న ‘పెట్యా’ వైరస్.. హిట్‌లిస్టులో భారత్!

కొద్ది రోజుల క్రితం ‘వాన్నా క్రై’ రాన్సమ్‌వేర్ సైబర్ ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడు అదే తరహాలో మరో భీకర సైబర్ దాడి మొదలైంది.

TNN 28 Jun 2017, 10:04 am
కొద్ది రోజుల క్రితం ‘వాన్నా క్రై’ రాన్సమ్‌వేర్ సైబర్ ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడు అదే తరహాలో మరో భీకర సైబర్ దాడి మొదలైంది. ‘పెట్యా’ రాన్సమ్‌వేర్ ఇప్పుడు సైబర్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఉక్రెయిన్‌లో ప్రారంభమైన ‘పెట్యా’ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు శరవేగంగా విస్తరిస్తూ బెంబేలెత్తిస్తోంది. యూరప్‌ను వణికిస్తున్న ఈ భయంకర రాన్సమ్‌వేర్.. భారత్‌ను టార్గెట్ చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రష్యా, ఇంగ్లండ్‌కు వ్యాపించిన పెట్యా హిట్‌లిస్టులో భారత్ కూడా ఉందని స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ మంగళవారం వెల్లడించింది.
Samayam Telugu europe reels under petya ransomware attack india too on the hitlist
వణికిస్తున్న ‘పెట్యా’ వైరస్.. హిట్‌లిస్టులో భారత్!


ఉక్రెయిన్‌లోని పవర్‌గ్రిడ్‌, బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసుల్లో కంప్యూటర్లను నిలిపివేసిన ఈ రాన్సమ్‌వేర్‌.. రష్యాలో అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి కంపెనీ ‘రాస్నెఫ్ట్’ సైబర్ వ్యవస్థపై మంగళవారం దాడి చేసింది. అయితే భారత్‌లో మాత్రం ఎలాంటి సైబర్ దాడి ఇప్పటి వరకు చోటుచేసుకోలేదని సెర్ట్-ఇన్ వెల్లడించింది. కానీ ఇండియాలోనే అతిపెద్ద కంటెయినర్ పోర్టు అయిన ‘జవహర్‌లాల్ నెహ్రూ పోర్టు ట్రస్ట్ (జేఎన్పీటీ)’పై సైబర్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. యూరప్‌లో పలు సెంట్రల్ బ్యాంకులు, పెద్ద సంస్థలపై విరుచుకుపడిన పెట్యా రాన్సమ్‌వేరే జేఎన్పీటీ వ్యవస్థపై కూడా దాటిచేసినట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.