యాప్నగరం

ఫాస్టెస్ట్ 4జీ నెట్‌వర్క్: మళ్లీ మొదలైన రచ్చ!

భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో మరోసారి రచ్చకెక్కాయి.

TNN 21 Mar 2017, 3:29 pm
భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో మరోసారి రచ్చకెక్కాయి. దేశంలో అత్యధిక వేగవంతమైన 4జీ నెట్‌వర్క్ ఎవరిదనే విషయంపై ఈ రెండు టెలీకాం సంస్థలు అమీతుమీ తేల్చుకోనున్నాయి. దేశంలో వేగవంతమైన నెట్‌వర్క్ తమదేనంటూ ఎయిర్‌టెల్ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై రిలయన్స్ జియో.. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI)ని ఆశ్రయించింది. తమపై ప్రభావం చూపుతున్న ఆ ఎయిర్‌టెల్ యాడ్‌ను వెంటనే ఆపేయాలని ఏఎస్‌సీఐని జియో కోరింది. అలాగే బ్రాడ్‌బ్యాండ్ టెస్టింగ్ కంపెనీ ‘ఊక్లా’కు కూడా జియో లీగల్ నోటీసు పంపింది. భారత్‌లో ఎయిర్‌టెల్ వేగవంతమైన నెట్‌వర్క్ అని రేటింగ్ ఇచ్చిన కంపెనీ ఇదే.
Samayam Telugu fastest network advertisements this is what airtel has to say on reliance jios complain to asci
ఫాస్టెస్ట్ 4జీ నెట్‌వర్క్: మళ్లీ మొదలైన రచ్చ!


అయితే రిలయన్స్ జియో ఫిర్యాదుపై ఎయిర్‌టెల్ ప్రతినిధి స్పందించారు. ‘బ్రాడ్‌బ్యాండ్ టెస్టింగ్‌లో ప్రపంచంలోనే ప్రధాన కంపెనీ అయిన ఊక్లా భారత్‌లో అత్యంత వేగవంతమైన నెట్‌వర్క్ ఎయిర్‌టెల్ అని రేటింగ్ ఇచ్చింది. మా యాడ్‌లో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాం. దేశవ్యాప్తంగా సరికొత్త స్మా్ర్ట్‌ఫోన్లలో ఇంటర్నెట్ వాడుతున్న కొన్ని మిలియన్ల వినియోగదారుల నుంచి డాటాను సేకరించి ఊక్లా ఈ రేటింగ్ ఇచ్చింది. దీనికోసం పాపులర్ ‘స్పీడ్‌టెస్ట్’ను ఊక్లా వాడింది’ అని ఎయిర్‌టెల్ ప్రతినిధి వెల్లడించారు.

కాగా, ఎయిర్‌టెల్‌పై ఫిర్యాదు చేస్తూ మార్చి 20న రిలయన్స్ జియో ఏఎస్‌సీఐకి ఓ లేఖ రాసింది. ఎయిర్‌టెల్ యాడ్‌లో నిజం లేదని, వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తుందని జియో ఆరోపించింది. మొబైల్ ఇంటర్నెట్ వేగాన్ని కొలిచిన పద్ధతి కూడా తప్పుల తడకగా ఉందని పరోక్షంగా ఊక్లాను జియో నిందించింది. దేశంలో 22 ఏళ్లుగా ఎయిర్‌టెల్ ఆధిపత్యం కొనసాగుతుందని, అలాంటి సంస్థ ఇంత అజ్ఞానంతో ఊక్లాతో కలసి ఇంటర్నెట్ స్పీడును కొలవడమేంటని లేఖలో పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.