యాప్నగరం

ఆ పరుగులే దిల్లీని గెలిపించాయట..!

మధ్యలో మా జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కనీసం 160 పరుగులు చేసినా చాలని

TNN 16 Apr 2017, 3:05 pm
ఐపీఎల్ పదో సీజన్‌‌లో దిల్లీ డేర్‌డెవిల్స్ గెలుపు బాట పట్టినందుకు ఆల్‌రౌండర్ కోరె అండర్సన్ ఆనందం వ్యక్తం చేశాడు. శనివారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన దిల్లీ జట్టు 51 పరుగుల తేడాతో టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో జట్టు ఊహించిన దానికంటే 20-30 పరుగులు ఎక్కువగా చేయడంతోనే సగం మ్యాచ్‌ని గెలిచేశామన్న అండర్సన్.. తొలుత వికెట్లు చేజార్చుకోవడంతో కంగారుపడినట్లు వివరించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ జట్టు పంజాబ్ బౌలర్ల ధాటికి 15.1 ఓవర్లలో 120/5తో నిలిచి తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. చివర్లో కోరె అండర్సన్ (39 నాటౌట్: 22 బంతుల్లో 3x4, 3x6) బ్యాట్ ఝళిపించడంతో 188 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఛేదనలో పంజాబ్ బ్యాట్స్‌మెన్లు తడబడటంతో ఆ జట్టు 137/9కే పరిమితమైంది.
Samayam Telugu getting those 20 30 extra runs was vital anderson
ఆ పరుగులే దిల్లీని గెలిపించాయట..!


‘ఓపెనర్లు శ్యామ్ బిల్లింగ్స్, సంజు శాంసన్ తొలి వికెట్‌కి 53 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభమిచ్చారు. కానీ.. మధ్యలో మా జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కనీసం 160 పరుగులు చేసినా చాలని నేను అనుకున్నాను. ఎందుకంటే మా జట్టు బౌలింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది.. ఆ స్కోరును మేము రక్షించుకోగలమని నమ్మకం. అయితే చివరికి మేము ఆశించిన దానికంటే 20-30 పరుగులు ఎక్కువగానే మేము రాబట్టగలిగాం. ఈ అదనపు పరుగులే మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి.. చివరికి విజయాన్ని చేకూర్చాయి’ అని అండర్సన్ ఆనందం వ్యక్తం చేశాడు. సొంతమైదానం ఫిరోజ్‌షా కోట్లలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే దిల్లీ డేర్‌డెవిల్స్ ఘన విజయం సాధించడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.