యాప్నగరం

డివిలియర్స్‌తో సెల్ఫీ.. కోహ్లి ఉద్వేగం

త్వరలోనే మైదానంలోకి అడుగుపెట్టి ఆటతో అందర్నీ అలరిస్తాం. ఒకే తల్లి బిడ్డలం కాకపోయినా.. మేము

TNN 6 Apr 2017, 6:32 pm
ఐపీఎల్ టోర్నీని ఓటమితో ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో తిరిగి ఉత్సాహం నింపేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రయత్నిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన సిరీస్‌లో గాయపడిన కోహ్లి బుధవారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. అతనితో పాటు డివిలియర్స్, కేఎల్ రాహుల్ సేవలు కూడా కోల్పోయిన బెంగళూరు ఈ మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో శనివారం దిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరగనున్న మ్యాచ్‌కి ఫిటెనెస్ సాధించేందుకు విరాట్ కోహ్లి నెట్స్‌లో తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అతనితో పాటు వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమైన డివిలియర్స్ కూడా గురువారం ప్రాక్టీస్ చేశాడు. దీంతో ఈ ఇద్దరు క్రికెటర్లలో కనీసం ఒకరైనా.. దిల్లీతో మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu great session today with the best in the world
డివిలియర్స్‌తో సెల్ఫీ.. కోహ్లి ఉద్వేగం


‘ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ డివిలియర్స్‌తో ప్రాక్టీస్ సెషన్ చాలా బాగా జరుగుతోంది. ఫిటెనెస్ కోసం ఇద్దరం శ్రమిస్తున్నాం.. త్వరలోనే మైదానంలోకి అడుగుపెట్టి ఆటతో అందర్నీ అలరిస్తాం. ఒకే తల్లి బిడ్డలం కాకపోయినా.. మేము అన్నదమ్ములం’ అంటూ విరాట్ కోహ్లి ఉద్వేగంగా తన ఫేస్‌బుక్ పేజీలో రాసుకొచ్చాడు. గత ఏడాది ఐపీఎల్‌లో కోహ్లి- డివిలియర్స్ జోడి భీకర హిట్టింగ్‌తో వరుస శతక భాగస్వామ్యాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్లో అనూహ్యంగా బెంగళూరు జట్టు హైదరాబాద్ చేతిలో ఓటమిపాలై టైటిల్‌ని చేజార్చుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.