యాప్నగరం

బెంగళూరుపై ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్

ఐదు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు సైతం ఒక మ్యాచ్‌లోనే గెలుపొంది పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది. దీంతో రెండు జట్లు

TNN 18 Apr 2017, 7:43 pm
ఐపీఎల్ పదో సీజన్‌‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ లయన్స్ ఒక విజయం మాత్రమే సాధించగా.. ఐదు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు సైతం ఒక మ్యాచ్‌లోనే గెలుపొంది పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది. దీంతో రెండు జట్లు ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో మళ్లీ గెలుపు బాట పట్టాలని ఆశిస్తున్నాయి. గత శుక్రవారం రాజ్‌కోట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రైజింగ్ పుణె నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ లయన్స్ 18 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించేసింది.
Samayam Telugu gujarat lions opt to bowl
బెంగళూరుపై ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్


గుజరాత్ లయన్స్ జట్టు
డ్వేన్‌స్మిత్, మెక్‌కలమ్, సురేశ్ రైనా, అరోన్ ఫించ్, ఇషాన్ కిషన్, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, ఆండ్రూ టై, కులకర్ణి, బాసిల్ థంపీ, కౌశిక్

బెంగళూరు జట్టు
విరాట్ కోహ్లి, క్రిస్‌గేల్, మన్‌దీప్ సింగ్, ట్రావిస్ హెడ్, కేదార్ జాదవ్, షేన్ వాట్సన్, స్టువర్ట్ బిన్నీ, పవన్ నేగి, ఆడమ్ మిల్నే, శ్రీనాథ్ అరవింద్, చాహల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.