ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీకి చెందిన మెకానికల్ ఇంజినీర్ విద్యుత్ సాయంతో నడిచే హైబ్రిడ్ విమానాలను అమెరికాలో రూపొందించాడు. వాషింగ్టన్లోని కిర్క్ల్యాండ్లో జునుమ్ ఏరో పేరిట సంస్థను ఏర్పాటు చేసిన ఐఐటీ ఢిల్లీకి చెందిన ఆశిష్ కుమార్ ప్రస్తుతం దానికి సీఈఓగానూ వ్యవహరిస్తున్నాడు. 1,100 కిలోమీటర్లు ప్రయాణించే ఈ ప్రాంతీయ విమానాలను 2020 ప్రారంభం నాటికి ఇండియాలో విక్రయించాలని భావిస్తున్నట్లు ఆశిష్ తెలిపారు. 2030 నాటికి వీటి పరిధిని 1,600 కిలోమీటర్లకు పెంచనున్నారు.
ఢిల్లీ ఐఐటీలో బీటెక్ పూర్తిచేసి, కార్నేల్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్లో పీహెచ్డీ పూర్తిచేసిన ఆశిష్ కుమార్ 20 సీట్ల సామర్థ్యం కలిగిన హైబ్రిడ్ ఎయిర్క్రాఫ్ట్ను రూపొందించాడు. మరో రెండేళ్లలో ప్రోటోటైప్ విమానాన్ని తయారుచేసి 2020 నాటికి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తామని ఆశిష్ తెలియజేశారు.
దీని ద్వారా ప్రయాణ ఛార్జీలు కూడా తక్కువేనని, సాధారణ వాటితో పోల్చుకుంటే తక్కువ ఎత్తులోనే ఈ విమానం ప్రయాణిస్తుందని అన్నారు. వాటి కంటే వేగం కూడా తక్కువే కానీ నిర్ణీత సమయంలో ప్రయాణికులను గమ్యానికి చేర్చే సామర్థ్యం మాత్రం దీనికి ఉందని కుమార్ పేర్కొన్నారు. ప్రాంతీయ రవాణ కోసం హైబ్రిడ్ టు ఎలక్ట్రిక్ విమానాల రూపకల్పనకు 2013లో జునుమ్ ఏరో సంస్థను ఆశిష్ కుమార్ ప్రారంభించారు.
అన్ని వర్గాల వారికి విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో 1000 కిలోమీటర్లు ప్రయాణించే హైబ్రిడ్ విమానాన్ని రూపకల్పనే లక్ష్యంగా పనిచేశారు. గ్యాస్ టర్బైన్లతో నడిపే పెద్ద విమానాల హై స్పీడ్ ప్రత్యామ్నాయాలకు బదులుగా ప్రాంతీయ మార్గాల్లో ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనానికి ఇవి ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం కేవలం ఒక్క శాతం మంది మాత్రమే ప్రయాణాలకు విమానాలపై ఆధారపడుతున్నారు. ఈ అంతరాన్ని హైబ్రిడ్ విమానం తగ్గించగలదనే నమ్మకం ఉందని ఆశిష్ వ్యాఖ్యానించారు.
సాధారణ విమానాలతో పోల్చుకుంటే ఇది 80 శాతం తక్కువ ఇంధనంతో నడుస్తుంది. తక్కువ ఇంధన ఖర్చు వల్ల ప్రయాణ ఛార్జీలు కూడా తగ్గుతాయి. దీని వల్ల భారత్కు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు.
ఢిల్లీ ఐఐటీలో బీటెక్ పూర్తిచేసి, కార్నేల్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్లో పీహెచ్డీ పూర్తిచేసిన ఆశిష్ కుమార్ 20 సీట్ల సామర్థ్యం కలిగిన హైబ్రిడ్ ఎయిర్క్రాఫ్ట్ను రూపొందించాడు. మరో రెండేళ్లలో ప్రోటోటైప్ విమానాన్ని తయారుచేసి 2020 నాటికి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తామని ఆశిష్ తెలియజేశారు.
దీని ద్వారా ప్రయాణ ఛార్జీలు కూడా తక్కువేనని, సాధారణ వాటితో పోల్చుకుంటే తక్కువ ఎత్తులోనే ఈ విమానం ప్రయాణిస్తుందని అన్నారు. వాటి కంటే వేగం కూడా తక్కువే కానీ నిర్ణీత సమయంలో ప్రయాణికులను గమ్యానికి చేర్చే సామర్థ్యం మాత్రం దీనికి ఉందని కుమార్ పేర్కొన్నారు. ప్రాంతీయ రవాణ కోసం హైబ్రిడ్ టు ఎలక్ట్రిక్ విమానాల రూపకల్పనకు 2013లో జునుమ్ ఏరో సంస్థను ఆశిష్ కుమార్ ప్రారంభించారు.
అన్ని వర్గాల వారికి విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో 1000 కిలోమీటర్లు ప్రయాణించే హైబ్రిడ్ విమానాన్ని రూపకల్పనే లక్ష్యంగా పనిచేశారు. గ్యాస్ టర్బైన్లతో నడిపే పెద్ద విమానాల హై స్పీడ్ ప్రత్యామ్నాయాలకు బదులుగా ప్రాంతీయ మార్గాల్లో ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనానికి ఇవి ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం కేవలం ఒక్క శాతం మంది మాత్రమే ప్రయాణాలకు విమానాలపై ఆధారపడుతున్నారు. ఈ అంతరాన్ని హైబ్రిడ్ విమానం తగ్గించగలదనే నమ్మకం ఉందని ఆశిష్ వ్యాఖ్యానించారు.
సాధారణ విమానాలతో పోల్చుకుంటే ఇది 80 శాతం తక్కువ ఇంధనంతో నడుస్తుంది. తక్కువ ఇంధన ఖర్చు వల్ల ప్రయాణ ఛార్జీలు కూడా తగ్గుతాయి. దీని వల్ల భారత్కు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు.