యాప్నగరం

దీన్ని అభివృద్ది అనగలమా? : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో పవన్

72 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక సందర్బంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

Samayam Telugu 15 Aug 2018, 11:54 am
72 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక సందర్బంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీస్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకను నిర్వహించారు. జనసేన అధికార ప్రతినిధి విజయ్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం పార్టీ ముఖ్యనేతలు, విద్యార్ధులు పాల్గొన్నారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్


ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘నేటి మన స్వాతంత్య్ర సంబరం ఎందరో మహానీయులు , వీరులు త్యాగాల ఫలం. సమరయోధుల పోరాట పటిమతో మనకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లభించాయి. మహనీయుల త్యాగాలను సార్ధకత చేయాల్సిన బాధ్యత భారతీయులందరిపైనా ఉంది. శాసనకర్తల స్థానాల్లో ఉన్న వారు కొద్దిమంది క్షేమం కోసం కాకుండా సువిశాల భారతాన్ని మదిలో ఉంచుకుని కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను కాపాడాలి. అందుకు భిన్నంగా వర్తమానం ఉంది. ఏడు దశాబ్ధాలుపైబడిన మన స్వతంత్ర భారతంలో అభివృద్ది ఫలాలు అతి కొద్ది మందికి మాత్రమే అందుతున్నాయి. ఆర్ధికంగా బలమైన వారు మరింత బలపడుతుంటే.. పేదవారు మరింత పేదలుగా మారడాన్ని అభివృద్ది అనగలమా? కుల, మత, ప్రాంత వివక్షలతో ఉన్న నేటి పరిస్థితులు సమాజానికి శ్రేయస్కరం కాదు.

గాంధీజీ, భగత్ సింగ్, ఆజాద్, అంబేద్కర్, అల్లూరి సీతా రామరాజు లాంటి మహనీయులు అదించిన స్పూర్తిని మనందరం నరనరాల్లో నింపుకోవాలి. పాలకుల కుటుంబాలు మాత్రమే వెలుగొందితే ప్రజాస్వామ్యం అనిపించుకోదు. మా కుటుంబం, మా వాళ్లు అనే కుత్సిత ధోరణితో పాలన చేసేవారి నుండి మనం విముక్తం కావాలి. అప్పుడే అట్టడుగు స్థాయి వరకూ సంక్షేమ ఫలాలు అందించగలం. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఇది మనందరి ఆకాంక్ష కావాలి’ అన్నారు పవన్ కళ్యాణ్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.